News August 23, 2025

HYD: రాబడి పెంచుకోవడంపై జలమండలి స్పెషల్ ఫోకస్

image

రెవెన్యూ పెంపుపై జలమండలి స్పెషల్ ఫోకస్ పెట్టింది. జలమండలి పరిధిలో డొమెస్టిక్ క్యాటగిరీ కింద ఉన్న వాణిజ్య కనెక్షన్లను గుర్తించడంతో రెవెన్యూను పెంచుకోవాలని భావిస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో నాన్ రెసిడెన్షియల్ భవనాల జాబితాను సేకరించి, వాటిని నేటి సరఫరా కనెక్షన్లతో పోల్చాలని జలమండలి నిర్ణయించింది.

Similar News

News January 18, 2026

నా జీవిత కాలం గుర్తుండిపోయే పవిత్ర జ్ఞాపకం: CM

image

మేడారం వేదికగా సమ్మక్క – సారలమ్మ సమక్షంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించుకోవడం ఒక అద్వితీయ ఘట్టమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ గిరిజన దేవతల ఆశీస్సులతో రాష్ట్ర ప్రగతి కోసం జరుగుతోన్న ఈ మంత్రివర్గ సమావేశం తన జీవిత కాలం గుర్తుండిపోయే పవిత్ర జ్ఞాపకమని సీఎం పేర్కొన్నారు.

News January 18, 2026

‘శాంతి బోర్డు’లోకి ఇండియాను ఆహ్వానించిన ట్రంప్!

image

గాజా శాంతి బోర్డులో చేరాలంటూ ఇండియాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఈ నెల 15న ఏర్పాటు చేశారు. దీనికి ట్రంప్ ఛైర్మన్‌గా ఉంటారని వైట్ హౌస్ ప్రకటించింది. 11 మంది సభ్యులతో ప్రత్యేకంగా గాజా కార్యనిర్వాహక బోర్డు ఉంటుందని తెలిపింది. మరోవైపు తమకూ ట్రంప్ నుంచి పీస్ బోర్డులోకి ఆహ్వానం అందిందని పాకిస్థాన్‌ వెల్లడించింది.

News January 18, 2026

HYD: పట్నం వచ్చినా.. మదిలో మాత్రం పల్లె జ్ఞాపకాలే!

image

ఉపాధి కోసం HYD బాట పట్టిన జనం, పండుగ రాగానే ఊరువైపు పరుగులు పెడతారు. పట్నంలో పరుగు తీసిన కష్టాన్ని మరిచే ఆనందం, పండగకు పల్లెల్లోనే దొరుకుతుందని చెబుతుంటారు. అమ్మ వంట, నాన్న ఆశీర్వాదం, బంధువుల ఆప్యాయత ఇవన్నీ పండగకు ఊరే చిరునామా.. కాంక్రీట్ జంగల్ HYD జీవితంలోనూ పల్లె జ్ఞాపకాలే మనసుకు ఊరటనిస్తాయి. సంక్రాంతికి ఊరెళ్లి, మళ్లీ HYD బాట పట్టిన ప్రజలు ముచ్చటిస్తున్నారు.