News April 21, 2024

HYD: రూ.5 వేలకు ఐపీఎల్ బ్లాక్ టికెట్లు?

image

ఉప్పల్ స్టేడియంలో IPL టికెట్ల అమ్మకాల్లో కుంభకోణం జరిగిందని ఓవైపు పలు సంఘాలు ఆరోపిస్తుంటే సోషల్ మీడియా వేదికగా రెండు ఐపీఎల్ టికెట్లు రూ.5,000 అంటూ విక్రయానికి రెడీ అయ్యారు. SRH VS RCB మ్యాచ్ ఏప్రిల్ 25న జరగనుండగా, సోషల్ మీడియా వేదికగా తమ వద్ద టికెట్లు అందుబాటులో ఉన్నాయని, కావాలనుకున్న వారు సంప్రదించాలంటూ పోస్టులు పెడుతున్నారు. దీని పై అధికారులు స్పందించాల్సి ఉంది.

Similar News

News December 17, 2025

HYD: దమ్ బిర్యానీ పక్కదారి!

image

వైరల్ రీచ్ కోసం యువ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అసలైన ‘దమ్ బిర్యానీ’ రుచిని పక్కన పెట్టి కేవలం ఫొటోలకు పనికొచ్చే ఫ్యాన్సీ ప్లేటింగ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాత తరపు ఘాటైన రుచికి, కొత్త తరఫు ఇన్‌స్టా-కేఫ్‌ల మెరుపులకు మధ్య యుద్ధమే నడుస్తోంది. ఏది ‘రుచి రాజసం’? ఏది ‘లైకుల మోసం’? అని బిర్యానీ లవర్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి ‘బిర్యానీ దమ్’ చచ్చిందా? ‘రీల్స్ ట్రెండ్’ గెలిచిందా? కామెంట్ చేయండి.

News December 17, 2025

HYDను UTగా మార్చే కుట్ర: మాజీ మేయర్

image

అన్నీ వసతులున్న HYDను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోందని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. GHMC విస్తరణ పేరుతో తెలంగాణను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఘాటుగా స్పందించారు. HYDను దేశానికి 2వ రాజధానిగా మార్చేందుకు మోదీ, చంద్రబాబు, రేవంత్‌తో యత్నాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

News December 17, 2025

HYDను UTగా మార్చే కుట్ర: మాజీ మేయర్

image

అన్నీ వసతులున్న HYDను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోందని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. GHMC విస్తరణ పేరుతో తెలంగాణను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఘాటుగా స్పందించారు. HYDను దేశానికి 2వ రాజధానిగా మార్చేందుకు మోదీ, చంద్రబాబు, రేవంత్‌తో యత్నాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.