News August 19, 2025
HYD: లిబర్టీ వద్ద గంజయితో దొరికారు..!

HYD ట్యాంక్ బండ్ పరిధి లిబర్టీ T జంక్షన్ దగ్గర సురజ్ ట్రావెల్స్ ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని దోమలగూడ పోలీసులు పట్టుకుని తనిఖీ చేశారు. వారిని గంజాయి పెడ్లర్లుగా గుర్తించి, అరెస్ట్ చేశారు. వారి నుంచి 18 కిలోల గంజాయి, 2 సెల్ఫోన్లను సీజ్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన కోమల్ సోమినాథ్ పవార్(23), సాహిల్ మహేశ్ సలున్కే(18) అరెస్టవగా విజయవాడకు చెందిన మరో నిందితుడు బాబు పరారయ్యాడు.
Similar News
News January 14, 2026
బస్సులో ప్రయాణించిన మంత్రి సురేఖ

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐనవోలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్ను మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో మంత్రి సురేఖ మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ టికెట్ పొంది ప్రయాణించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.
News January 14, 2026
ఇందిరమ్మ పథకం.. ఖాతాల్లో డబ్బులు జమ

TG: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి వారం బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో భాగంగా ప్రస్తుత వారానికి రూ.152.40 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని 13,861 మంది ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 2.50 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని, మార్చి నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపింది. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1800 599 5991కు ఫిర్యాదు చేయాలని సూచించింది.
News January 14, 2026
జర్నలిస్టుల అరెస్టులు.. KTR సంచలన వ్యాఖ్యలు

జర్నలిస్టుల అరెస్టు విషయంలో రాహుల్ గాంధీ వైఖరిని KTR ఖండించారు. ‘మీ మొహబ్బత్ కీ దుకాన్ తెలంగాణ పౌరుల రాజ్యాంగ హక్కులను ఏ విధంగా కాలరాస్తోందో గమనిస్తున్నారని ఆశిస్తున్నాను. నిన్న రాత్రి ముగ్గురు జర్నలిస్టులను రాష్ట్ర పోలీసులు అపహరించారు. పోలీసులు జర్నలిస్టుల ఇళ్ల తలుపులు పగులగొట్టారు. ఇది కేవలం బెయిలబుల్ సెక్షన్లు ఉన్న కేసు, పోలీసులు BNSS సెక్షన్ 35 కింద నోటీసు ఇచ్చి ఉండవచ్చు’ అని Xలో ఖండించారు.


