News October 5, 2025

HYD: వచ్చే వారం హౌసింగ్ బోర్డు భూముల విక్రయాలు

image

హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో OCT 6 నుంచి GHMC పరిధి, శివారులో ఖాళీ ప్లాట్ల విక్రయాలు జరగనున్నాయి. సోమవారం చింతల్, నిజాంపేట, బాచుపల్లిలో ఉన్న 22 రెసిడెన్షియల్ ప్లాట్స్‌, ఫ్లాట్లను బహిరంగ వేలం ద్వారా అమ్ముతారు. 7, 8న KPHBలో 4 కమర్షియల్ ప్లాట్లు, నాంపల్లిలోని 1148 చదరపు గజాల ప్లాట్‌ను E-వేలం వేస్తారు. అక్టోబర్ 9, 10 తేదీల్లో చింతల్(కమర్షియల్ భూమి), రావిర్యాలకు సంబంధించిన భూములకు E-వేలం ఉంటుంది.
SHARE IT

Similar News

News January 25, 2026

16 రోజుల డిజిటల్ అరెస్ట్.. రూ.14 కోట్లు స్వాహా

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ NRI దంపతుల నుంచి ఏకంగా రూ.14.84 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. తాము CBI, పోలీసులమని చెప్పి నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి ఢిల్లీలో నివసిస్తున్న 77 ఏళ్ల మహిళ, ఆమె భర్తను 16 రోజుల పాటు వీడియో కాల్‌లో నిరంతరం నిఘా పెట్టారు. భయంతో బాధితులు తమ పెట్టుబడుల నుంచి డబ్బును వారికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ కేసులో GJ, UP, ఒడిశా రాష్ట్రాల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News January 25, 2026

రథసప్తమి.. తిరుమలలో పటిష్ఠ బందోబస్తు

image

తిరుమలలో శ్రీవారి రథసప్తమి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, టీటీడీ సీవీ&ఎస్‌ఓ మురళీకృష్ణ కీలక ప్రాంతాలను పరిశీలించి బందోబస్తును సమీక్షించారు. భారీగా భక్తుల రాక నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పుష్కరిణి వద్ద అదనపు సిబ్బంది, జియో-ట్యాగింగ్ వంటి చర్యలు చేపట్టారు.

News January 25, 2026

సంగారెడ్డి: పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

image

సంగారెడ్డి జిల్లాలో వివిధ దాడుల్లో పట్టుబడిన అక్రమ పీడీఎస్ బియ్యాన్ని బహిరంగ వేలం వేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. గోదాముల్లో నిల్వ ఉన్న ఈ సరుకును “యథాతథం” పద్ధతిలో విక్రయించనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన బీవరేజెస్, డిస్టిలరీ సంస్థల నుండి సీల్డ్ కొటేషన్లను ఆహ్వానించారు. ఆసక్తి గల వారు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.