News August 22, 2025

HYD: వింటూనే ఉన్నాం.. ఎప్పుడు చూస్తామో!

image

ప్రత్యేక తెలంగాణ వచ్చి నేటికి 11ఏళ్ల 2 నెలల 20 రోజులైంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఓ పదం వింటూనే ఉన్నాం.. ‘మూసీని అభివృద్ధి చేస్తాం’ అని. ఈ పదం వినీ.. వినీ నగరవాసికి విసుగెత్తిపోయింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇపుడు కాంగ్రెస్ సర్కార్‌కు ఈ పదం పలకడం అలవాటైపోయింది. మూసీని అభివృద్ధి చేయకుండా.. చేస్తాం, చేస్తాం అని ఇంకెన్నేళ్లు చెబుతారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 23, 2026

విశాఖ: మద్యం డబ్బుల కోసం RTC బస్సు చోరీ

image

మద్యం డబ్బుల కోసం ఓ వ్యక్తి APSRTC బస్సును దొంగిలించాడు. ఈ ఘటన జనవరి 17న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. మద్దిలపాలెం డిపోలో పార్క్ చేసిన బస్సు మాయమవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు అనకాపల్లి (D) మారేడుపూడికి చెందిన పైడిరాజును ఈనెల 19న పట్టుకున్నారు. డీజిల్ అమ్మి మద్యం తాగాలనే ఉద్దేశంతోనే బస్సు ఎత్తుకెళ్లినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

News January 23, 2026

ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు వెల్లుల్ల మహిళ

image

మెట్ పల్లి మండలం వెల్లుల్లకు చెందిన జాగృతి మహిళ మండల సమాఖ్య అధ్యక్షురాలు గోర్ల లతకు ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది. గొర్ల లత స్వశక్తి సంఘంలో చేరి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలిగా, జాగృతి మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నుకోబడి జిల్లా మహిళ సమాఖ్య ఈసీ మెంబర్గా ఉన్నారు. గణతంత్ర వేడుకలకు ఎంపికైన ఆమెను ఏపీఎం, సీసీలు, మహిళ సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు అభినందించారు.

News January 23, 2026

NLG: రా మెటీరియల్ సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

image

అనుముల, డిండి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల(ITI)లకు రా మెటీరియల్ సరఫరా చేసేందుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ ITI ప్రిన్సిపల్ తెలిపారు. సుమారు రూ.31,93,200 వ్యయంతో ఈ ముడి సరుకులను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన సరఫరాదారులు టెండర్ ఫారాలు, పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.