News August 10, 2024
HYD: సయ్యద్ అబ్దుల్ రహీం ఎవరో తెలుసా..?

గ్రేటర్ HYD పరిధిలో మలక్పేట్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్దుల్ రహీం 1950 నుంచి 1963 వరకు భారత్ ఫుట్ బాల్ టీమ్ కోచ్గా వ్యవహరించారు. ఈ కాలం భారత ఫుట్ బాల్ క్రీడకు స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. సయ్యద్ అబ్దుల్ రహీం ఫుట్ బాల్ క్రీడకు చేసిన సేవలు ఇతివృత్తంతో ఇటీవల మైదాన్ సినిమా సైతం తీశారు. కాగా తాజాగా ఫుట్ బాల్ మైదానాల ఏర్పాటుకు GHMC రంగం సిద్ధం చేయడంతో మళ్లీ మన HYD ఫుల్బాల్ క్రీడలో దూసుకుపోనుంది.
Similar News
News July 10, 2025
GHMCలో మీడియాపై ఆంక్షలు?

GHMC కార్యాలయాల్లోకి మీడియా ఎంట్రీని వారానికి ఒక్కరోజే అనుమతించాలని స్టాండింగ్ కమిటీ తీర్మానించినట్లు తెలుస్తోంది. ముందు పూర్తిగా నిషేధించాలని భావించినా, చర్చల అనంతరం ఒక్కరోజుకు వెసులుబాటు కల్పించింది. దీంతో GHMC, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోకి మీడియాకు వారానికి ఒక్కరోజే అనుమతి ఉండనుంది. తమ విధులకు ఆటంకం కలగకుండా ఉండేందుకే దీనికి కారణంగా తెలుస్తోండగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News July 10, 2025
నిజాంపేట్లో మరో కల్తీ కల్లు కేసు.. గాంధీకి తరలింపు

కల్తీ కల్లు తాగి నిజాంపేట్లోని హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న <<17017648>>వి.సుగుణమ్మ(58)<<>>ను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమెకు కూడా ఆ కళ్లు తాగడంతోనే వాంతులు విరోచనాలు కాగా కుటుంబ సభ్యులు నిజాంపేట్లోని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. మెరుగైన వైద్యచికిత్సల కోసం నేడు 108 సిబ్బంది సతీశ్ శ్రీనివాస్, సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
News July 10, 2025
HYD: కల్లీ కల్లు ఘటనలో మృతుల వివరాలు.!

కూకట్పల్లిలో కల్తీ కల్లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కూకట్పల్లిలో భాగ్యనగర్ కాలనీలోని కల్లు కాంపౌండ్, ఇంద్రహిల్స్లోని కల్లు కాంపౌండ్, హైదర్నగర్లో మరొక్క కల్లు కాంపౌండ్లో ఆదివారం తాగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిలో HMT హిల్స్కి చెందిన ఇద్దరు, హైదర్నగర్, శ్రీరామ్నగర్, మహంకాళి నగర్, సాయి చరణ్ కాలనీకి చెందిన వారు మృత్యువాత పడ్డారు. 30 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.