News November 2, 2025

HYD: ప్రచారంలో దోశ వేసిన మంత్రి

image

జూబ్లీహిల్స్ పరిధి రహమత్‌నగర్ డివిజన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉపఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీరామ్ నగర్, సంధ్యా నగర్, కార్మిక నగర్, వినాయకనగర్, ఎస్‌పీఆర్ హిల్స్‌లో పాదయాత్ర నిర్వహించి, ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. అనంతరం ఓ హోటల్‌లో మంత్రి దోశ వేసి సందడి చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించి, ప్రజాపాలనకు మద్దతు తెలపాలన్నారు.

Similar News

News November 2, 2025

రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

ఏపీలోని కర్నూలు, తిరుపతి జిల్లాల్లో రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.

News November 2, 2025

మణుగూరు దాడి.. భద్రాచలం MLA ఎటువైపు?

image

తాను BRS పార్టీలోనే ఉన్నానని స్పీకర్‌కు తెలిపిన భద్రాచలం MLA తెల్లం వెంకటరావు ప్రస్తుతం అయోమయ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మణుగూరులోని BRS కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన ఖండించకపోవడం చర్చనీయాంశమైంది. దాడిని ఖండించక పోవడం, మద్దతు ప్రకటించకపోవడంపై BRS శ్రేణులు, సామాన్య ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తారో లేదో చూడాలని బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

News November 2, 2025

ప్రకాశం జిల్లా ప్రజలకు SP కీలక సూచనలు..!

image

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు SP హర్షవర్ధన్ రాజు ఆదివారం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితోపాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాల్లో మన అప్రమత్తతే మనకు రక్షని సూచించారు.