News August 20, 2025
HYD: 3 రోజులుగా బాలిక హత్య కేసు విచారణ

కూకట్పల్లిలో మైనర్ బాలిక హత్య కేసు మిస్టరీగా మిగిలింది. భవనంలో నివసించే వారిపైనే పోలీసుల దృష్టి కేంద్రీకరించారు. సోమవారం ఒకరిని, మంగళవారం ముగ్గురిని విచారించినా ఎలాంటి పురోగతి లేదు. తల్లిదండ్రులు కృష్ణ, రేణుకను సైతం విచారణకు పిలిపించారు. క్రైమ్ స్పాట్లో సేకరించిన వేలిముద్రలు, సెల్ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన జరిగి 3 రోజులు గడిచినా కేసులో ఎలాంటి స్పష్టత రాలేదు.
Similar News
News January 17, 2026
విధుల్లో చేరిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా పులి శ్రీనివాసులు శనివారం ఉదయం విధుల్లో చేరారు. ఇవాళ తన కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. అద్దంకి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్-2 పరీక్షలో ఉత్తీర్ణులై 2009లో అద్దంకి ఎమ్మార్వోగా పనిచేసిన పులి శ్రీనివాసరావు పని చేశారు. ఇటీవల నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు జాయింట్ కలెక్టర్గా నియమితులయ్యారు.
News January 17, 2026
తిరుపతి: ఈ రెండు పరీక్షలు తప్పక రాయాల్సిందే..!

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు 2 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈనెల 21న నైతికత, మానవీయ విలువలు, 23న పర్యావరణ పరిరక్షణ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు ఉత్తీర్ణత కాకపోతే.. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయినా కూడా మార్కులు కనిపించవని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 30,318 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ పరీక్షలకు తప్పనిసరిగా హాజరయ్యేలా తల్లిదండ్రులు చొరవచూపాలి.
News January 17, 2026
నితీశ్ రెడ్డి ఆల్రౌండర్ కాదు: కైఫ్

NZతో ODI సిరీస్లో IND పిచ్కి తగ్గట్టు ప్లేయింగ్-11ని ఎంపిక చేయట్లేదని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. జట్టులో నితీశ్ రోల్ ఏంటో అర్థం కావడం లేదని తన YouTube వీడియోలో చెప్పుకొచ్చారు. ‘నితీశ్ ఆల్రౌండర్ కాదు. అతను బ్యాటర్ మాత్రమే. ఈ విషయాన్ని మేనేజ్మెంట్ వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలి. అతడిని బ్యాటర్గా డెవలప్ చేయాలి. పార్ట్ టైమ్ బౌలర్ను ఆల్రౌండర్ అనడం కరెక్ట్ కాదు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.


