News October 8, 2025
HYD: 8 ఏళ్లు.. రూ.134.41 కోట్లు!

భూమి బంగారం అంటారు. అదే మన HYDలో వజ్రాన్ని మించిపోయింది. రాయదుర్గంలో ఎకరం భూమి రూ.177 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. 2017లో ఎకరం రూ.42.59 కోట్లు ఉండేది. 8 ఏళ్ల కాలంలో ఏకంగా రూ.134.41 కోట్లకు పెరగడం విశేషం. దేశంలోనే గరిష్ఠ ధరకు ఎకరం భూమి అమ్ముడుపోయింది మన రాయదుర్గంలోనే. ఇక్కడ భవనాలే కాదు భూముల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ధరలు ఈ స్థాయిలో ఉంటే మధ్య తరగతి ప్రజల సొంతింటి కల కలగానే మిగలనుంది.
Similar News
News January 19, 2026
హైదరాబాద్లో కొత్త ట్రెండ్.. ‘పబ్బుల్లో పాఠాలు’

సిటీ కుర్రాళ్ల సోషల్ లైఫ్ ఇప్పుడు రూటు మార్చింది. వీకెండ్ వస్తే కేవలం డాన్స్ ఫ్లోర్ల మీద స్టెప్పులేయడమే కాదు.. చేతిలో బీర్ గ్లాసు పట్టుకొని ‘స్ట్రింగ్ థియరీ’ వంటి కఠినమైన సైన్స్ ముచ్చట్లు వినడం ఇప్పుడు GEN-Zలో కొత్త క్రేజ్. ‘పింట్ ఆఫ్ వ్యూ’ వంటి ఈవెంట్లే దీనికి సాక్ష్యం. సైన్స్, హిస్టరీ, క్వాంటం ఫిజిక్స్ వంటి సీరియస్ విషయాలను చిల్ అవుతూ నేర్చుకోవడానికి మన HYD కుర్రాళ్లు బాగా ఇష్టపడుతున్నారు.
News January 19, 2026
HYD: ఇరిగేషన్ సంతకం.. వేల కోట్ల వశం!

TDR జారీకి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అదనపు కలెక్టర్ క్లియరెన్స్ ఉండాలన్న నిబంధన ఇప్పుడు కొత్త పైరవీలకు కేంద్రమైంది. ఫైనల్ ఎఫ్టీఎల్ (FTL) నోటిఫికేషన్ లేని చెరువుల విషయంలో అధికారులదే అంతిమ నిర్ణయం కావడంతో ఎవరికి TDR ఇవ్వాలి? ఎవరికి ఆపాలి అన్నది? ‘నోట్ల’ కట్టలే నిర్ణయిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. TDR లావాదేవీలపై పబ్లిక్ ఆడిట్ లేకపోవడం ఈ అక్రమాలకు ప్రధాన ఊతంగా మారుతోంది.
News January 19, 2026
GO 16 మర్మం: సామాన్యుడికి శాపం.. బడా బాబులకు లాభం!

చెరువుల పరిరక్షణ ముసుగులో తెచ్చిన GO 16 నిబంధనలు అమలులోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో పెను మార్పులు ఖాయం. సెక్షన్ 4 కింద రికార్డుల్లో లేని నాలాలకూ 400% TDR ఇస్తుండటంతో రియల్టర్లు అధికారులతో కుమ్మక్కై పనికిరాని గుంటలను ‘నాలా’గా చూపిస్తూ వేల కోట్ల నిర్మాణ హక్కులు పొందే ప్రమాదం ఉంది. సెక్షన్ 6 ‘TDR బ్యాంకు’లో జమ అయ్యే వివాదాస్పద భూములపై పారదర్శకత లేకపోతే బ్రోకర్ల దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది.


