News February 27, 2025
ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం: KTR

TG: సినీ నిర్మాత కేదార్ మరణం గురించి సీఎం రేవంత్ చేసిన <<15587966>>వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘హత్యలు, మరణాలు అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉండి ప్రతిపక్షంలా మాట్లాడుతున్నారు. తాను ఏం చెప్పినా జనాలు నమ్ముతారని అనుకోవడం పొరపాటే. ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉంది. ఎలాంటి విచారణకైనా సిద్ధం’ అని స్పష్టం చేశారు.
Similar News
News February 27, 2025
ఇళ్ల నిర్మాణంపై కీలక ఉత్తర్వులు

APలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ శాఖ గైడ్లైన్స్ ఇచ్చింది. ఆక్యుపేషన్ సర్టిఫికెట్పై భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలంది. ఎప్పటికప్పుడు అధికారులు బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాలు తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. ప్లాన్ మేరకు నిర్మాణం లేకపోతే నివాసయోగ్య పత్రం జారీ చేయకూడదని పేర్కొంది. ఆ పత్రం లేకపోతే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు, బ్యాంకులు రుణాలు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది.
News February 27, 2025
గ్రూప్-2 మెయిన్స్: అభ్యంతరాల గడువు పొడిగింపు

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో ప్రశ్నలు, కీపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువును APPSC రేపటి వరకు పొడిగించింది. ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తామని, పోస్ట్, ఫోన్, SMS, వాట్సాప్ ద్వారా పంపితే పరిగణించబోమని స్పష్టం చేసింది. అనేక వివాదాలు, ఆందోళనల నడుమ ఈ నెల 23న జరిగిన పరీక్షకు 79,599 మంది హాజరైన విషయం తెలిసిందే. అదే రోజు ప్రాథమిక కీని కమిషన్ విడుదల చేసింది.
వెబ్సైట్: https://portal-psc.ap.gov.in/
News February 27, 2025
14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి: హరీశ్ రావు

TG: రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను కాపాడలేని దుస్థితిలో INC ప్రభుత్వం ఉందని BRS MLA హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాలను AP తరలించుకుపోతుంటే చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు. గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తుంటే నోరెత్తడం లేదని ఫైరయ్యారు. SLBC టన్నెల్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ 14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. SLBC వద్ద శిథిలాల తొలగింపులో వేగం పెంచాలి’ అని పేర్కొన్నారు.