News November 19, 2025
iBOMMA బంద్.. ఇక కలెక్షన్లు పెరుగుతాయా?

iBOMMA క్లోజవడంతో సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవి వల్ల ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం జరిగిందని, ఇకపై తమకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. అయితే పైరసీ ఆగినందున మూవీల కలెక్షన్లు పెరుగుతాయా? అనే చర్చ మొదలైంది. సినిమాల్లో సత్తా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకే వెళ్తారని, ఇది ఎన్నోసార్లు రుజువైందని నెటిజన్లు పేర్కొంటున్నారు. కలెక్షన్లపై పైరసీ ప్రభావం నామమాత్రమేనంటున్నారు. మీరేమంటారు?
Similar News
News January 23, 2026
స్పేస్ అప్లికేషన్ సెంటర్లో 49 పోస్టులకు నోటిఫికేషన్

అహ్మదాబాద్లోని <
News January 23, 2026
లక్ష్మీదేవి కొలువై ఉండే పదార్థాలు ఇవే..

శాస్త్రాల ప్రకారం పాలు, పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, వీటిని గౌరవిస్తూ ఇల్లు శుభ్రంగా ఉంచుకునే వారిపై ఆమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఈ వస్తువుల పట్ల భక్తిశ్రద్ధలతో ఉండాలని పండితులు సూచిస్తున్నారు. సోమరితనం, కలహాలు ఉన్న చోట లక్ష్మి నిలవదని చెబుతున్నారు. వాటి పట్ల గౌరవంగా వ్యవహరిస్తే సంపద, ఐశ్వర్యం నిలకడగా ఉంటాయి.
News January 23, 2026
భాస్వరం, నత్రజని ఎరువులను ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనం?

పంట నాటిన/విత్తిన రెండు వారాలలోపే మొత్తం భాస్వరం ఎరువులను పంటలకు వేయాలి. పైపాటుగా వాడకూడదు. నత్రజని, పొటాష్ ఎరువులను పూతదశకు ముందే వేసుకోవాలి. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా మూడు దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. సూక్ష్మపోషక ఎరువులను పంటకు స్ప్రే రూపంలో అందించాలి.


