News March 14, 2025
నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం: రాజగోపాల్ రెడ్డి

TG: తనకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీ, ప్రజలకే లాభమని మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలిపారు. ‘నిద్రాహారాలు మాని భువనగిరి MP సీటును గెలిపించా. 2018లో నేను INC తరఫున పోటీ చేస్తే BJPకి, ఆ తర్వాత BJP నుంచి బరిలో ఉంటే INCకు డిపాజిట్ రాలేదు. 2023లోనూ INC నుంచి పోటీ చేస్తే BJPకి డిపాజిట్ దక్కలేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News February 17, 2026
రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం.. ఫొటోకు రూ.7-10

TG: పంటల నమోదు సర్వే కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివి గ్రామ భూములపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లిస్తారు. 45 రోజుల యాసంగి సీజన్లో 2000 ఫోటోల వరకు అప్లోడ్ చేయవచ్చు. విద్యార్హత పత్రాలతో మండల వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకోవాలి.
News February 17, 2026
ఫ్యామిలీతో ఇండియాకు రండి.. తారిఖ్కు మోదీ ఆహ్వానం

బంగ్లాదేశ్ PM తారిఖ్ రెహ్మాన్కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పదవీకాలంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. భార్య జుబైదా, కుమార్తె జైమాతో కలిసి INDలో పర్యటించాలని ఆహ్వానించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కనెక్టివిటీ, ట్రేడ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఎనర్జీ, హెల్త్ కేర్ రంగాల్లో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
News February 17, 2026
భారత్తో ఓటమి.. నఖ్వీ కోపానికి పాక్ కోచ్ బలి?

టీమ్ఇండియా చేతిలో ఓటమి తర్వాత పాక్ కోచ్ మైక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొలంబోలోని ప్రసిద్ధ ‘క్రికెట్ క్లబ్ కేఫ్’లో ఆయన కనిపించిన దృశ్యాలు SMలో వైరలవుతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లు, మేనేజ్మెంట్పై PCB ఛైర్మన్ నఖ్వీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. రేపు నమీబియాతో మ్యాచ్లో పాక్ ఓడిపోతే ఆ జట్టు ఇంటికెళ్లాల్సిందే. ఈ తరుణంలో కేఫ్లో మైక్ కనిపించడం చర్చకు దారితీసింది.


