News March 19, 2024
జగన్కు ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే: దస్తగిరి

AP: జగన్ పరిపాలన రాక్షస పాలనను తలపిస్తోందని పులివెందుల జై భీమ్ రావు భారత్ పార్టీ MLA అభ్యర్థి దస్తగిరి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాజారెడ్డి, జగన్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ఈసారి జగన్కు ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే అని అన్నారు. వివేకా హత్య కేసులో తాను అప్రూవర్గా మారకపోయి ఉంటే తనకు కూడా ఓటు అడిగే హక్కు లేదని అన్నారు.
Similar News
News December 7, 2025
పవన్కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అరుదైన గౌరవం దక్కింది. ఉడుపి(KN)లోని పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదును ప్రదానం చేశారు. ‘బృహత్ గీతోత్సవ’లో పవన్ మాట్లాడుతూ భగవద్గీత ఓ సారి చదివి ఎర్ర వస్త్రంతో కప్పి పూజా గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మన జీవితంలో ప్రతి నిర్ణయం, సమస్యలకు పరిష్కారంగా మనల్ని నడిపించే జ్ఞానం భగవద్గీత అని పేర్కొన్నారు.
News December 7, 2025
ఇంగ్లండ్ చెత్త రికార్డు

యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగిస్తోంది. రెండో టెస్టులోనూ <<18496629>>పరాజయంపాలైన<<>> ఆ టీమ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. D/N టెస్టు తొలి ఇన్నింగ్స్లో 300+ స్కోర్ చేసి ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది. అలాగే ఒకే విదేశీ గడ్డపై విజయం లేకుండా అత్యధిక మ్యాచులు(16) ఆడిన క్రికెటర్గా జో రూట్ ఖాతాలో అన్వాంటెడ్ రికార్డు చేరింది. అతను ఆడిన మ్యాచుల్లో 14 ఓడిపోగా, 2 డ్రా అయ్యాయి.
News December 7, 2025
సైనికుల క్రమశిక్షణ, సామర్థ్యం చూశాం: రాజ్నాథ్ సింగ్

‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైనికుల సామర్థ్యం, క్రమశిక్షణ చూశామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పరాక్రమంతో పాటు సంయమనం కూడా చూపారని గుర్తుచేశారు. ఎంత కావాలో అంతే చేశారని, అనుకుంటే మరింత చేసేవారన్నారు. బార్డర్లో మెరుగైన కనెక్టివిటీ భద్రతా దళాలు సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడుతోందని చెప్పారు. BRO పూర్తి చేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్నాథ్ ఈ కామెంట్లు చేశారు.


