News April 1, 2024

వాలంటీర్లపై కీలక ఆదేశాలు

image

AP: ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించడంతో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ రంగంలోకి దిగింది. వాలంటీర్లకు ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్‌లు, ట్యాబ్‌లు వంటివి వెంటనే స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు సచివాలయాల శాఖ స్పష్టం చేసింది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని వాలంటీర్ల వద్ద పరికరాలను స్వాధీనం చేసుకునేలా చూడాలని కలెక్టర్లకు సూచించింది.

Similar News

News February 12, 2026

నేటి అసెంబ్లీ షెడ్యూల్

image

AP: ఇవాళ అసెంబ్లీ ఉ.9 గం.కు ప్రారంభం కానుంది. 10 గం. వరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. సభ నడిచే 17 రోజుల్లో రోజుకు 10 ప్రశ్నలు మాత్రమే అనుమతిస్తారు. అనంతరం ప్రభుత్వం 8 సవరణ ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, దానిపై చర్చలు జరగనున్నాయి. ఎల్లుండి (ఫిబ్రవరి 14) మంత్రి పయ్యావుల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

News February 12, 2026

స్కూళ్లకు బంద్ లేనట్లే..!

image

భారత్ <<19115946>>బంద్<<>> ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లపై అంతగా లేనట్లు తెలుస్తోంది. ఇవాళ స్కూల్‌కు సెలవు అని మెసేజులు రాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థి సంఘాలు ఈ బంద్‌లో పాల్గొనట్లేదు కాబట్టి అంతరాయం కలిగించే అవకాశాలు లేవు. బ్యాంకులు, రవాణా, ప్రభుత్వ కార్యాలయాలపై బంద్ ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఇవాళ స్కూళ్లకు హాలిడే అని మీకేమైనా మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

News February 12, 2026

చిన్నారులకు నాన్‌వెజ్ ఎప్పుడు పెట్టాలంటే?

image

పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. 6నెలల నుంచి పిల్లలకు నెమ్మదిగా ఘనాహారం అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 8నెలల నుంచి మాంసాహారం ఇవ్వాలి. ముందుగా ఉడికించిన గుడ్డు, సంవత్సరం దాటిన తర్వాత చికెన్, చేపలు పెట్టాలి. వాటిని బాగా ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలని చెబుతున్నారు. మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నెమ్మదిగా పిల్లలకు అలవాటు చెయ్యాలంటున్నారు.