News July 4, 2024

మరికాసేపట్లో ప్రధాని మోదీతో విశ్వవిజేతల భేటీ

image

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో బార్బడోస్ నుంచి స్వదేశానికి వచ్చిన భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీని మరికాసేపట్లో కలవనుంది. దేశరాజధాని ఢిల్లీలో ఉదయం 11 గంటలకు మోదీతో విశ్వవిజేతల భేటీ ఉంటుందని నేషనల్ మీడియా తెలిపింది. ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకున్న జట్టు హోటెల్‌లో సేదదీరుతోంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు విక్టరీ పరేడ్ జరగనుంది.

Similar News

News December 12, 2025

ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

image

AP: అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు <<18539107>>ప్రమాదంపై<<>> సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

News December 12, 2025

మహిళల్లో ఐరన్ లోపం లక్షణాలివే..

image

మహిళల్లో ఐరన్ లోపం ఉంటే అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జుట్టు ఎక్కువగా రాలడం కూడా ఐరన్ లోపానికి సంకేతాలే. దీన్ని తగ్గించడానికి పాలకూర, బీట్‌రూట్, పప్పులు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు తీసుకోవాలి. అలాగే టమిన్-సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

News December 12, 2025

టీమ్ఇండియా చెత్త రికార్డ్

image

టీ20ల్లో 210+ పరుగుల ఛేదనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 7 సార్లు ప్రత్యర్థి జట్లు 210+ స్కోర్లు చేయగా, అన్నింటిలోనూ భారత్ ఓడింది. నిన్న సౌతాఫ్రికా 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 162 రన్స్‌కే టీమ్ఇండియా ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 2023లో విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు IND హయ్యెస్ట్ ఛేజింగ్ స్కోర్.