News April 20, 2024
రాయి దాడిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీకి సీఈవో నోటీసులు

AP: సీఎం జగన్పై రాయి దాడి తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ జనరల్ సెక్రటరీకి సీఈవో నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జై టీడీపీ, తెలుగు దేశం పార్టీ అకౌంట్ల నుంచి జగన్పై అనుచిత పోస్టులు చేశారని సీఈవోకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.
Similar News
News December 11, 2025
ESIC ఢిల్లీలో 134 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<
News December 11, 2025
ఉత్కంఠ.. 4 ఓట్లతో గెలిచింది

TG: హన్మకొండ(D) ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠకు దారి తీసింది. చివరికి పి.స్రవంతి 4 ఓట్లతో గెలిచారు. కామారెడ్డి(D) బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లిలో BRS బలపరిచిన భాగ్యమ్మ 5 ఓట్లతో గట్టెక్కారు. వరంగల్(D) వర్ధన్నపేట మండలం అంబేడ్కర్నగర్ 1వ వార్డులో రజనీ, రూపకు తలో 31 ఓట్లు రావడంతో డ్రా అయింది. అధికారులు ఫలితం కోసం చిట్టీలు వేయగా రూపను అదృష్టం వరించింది.
News December 11, 2025
ఆఫీస్కు త్వరగా వస్తోందని ఉద్యోగి తొలగింపు.. నెట్టింట చర్చ!

ఆఫీసుల్లో సమయపాలన ఎంత ముఖ్యమో తెలిపే ఘటనే ఇది. స్పెయిన్లో 22 ఏళ్ల యువతిని ఓ కంపెనీ పంక్చువాలిటీ లేదని తొలగించడం చర్చనీయాంశమైంది. తన షిఫ్ట్ టైమింగ్కు కాకుండా 40 నిమిషాలు ముందుగానే ఆమె ఆఫీసుకు వచ్చింది. వార్నింగ్ ఇచ్చినా 19సార్లు ఇలానే రావడంతో యాజమాన్యం విసుగుచెందింది. ఇలా చేయడం వల్ల మిగతా ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిందని కంపెనీ ఆరోపిస్తోంది. దీనిపై ఆ యువతి కోర్టుకెళ్లినా ఫలితం దక్కలేదు.


