News December 20, 2024

ఫిబ్రవరి 23న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ తలపడతాయని తెలుస్తోంది. ఈ మ్యాచ్ దుబాయ్ లేదా కొలంబోలో జరుగుతుందని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఐసీసీ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. కాగా ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లోనే జరుగుతుంది. భారత్ మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో జరుగుతాయి.

Similar News

News January 23, 2025

బీసీ రిజర్వేషన్లు పెంచాలని సీఎంకు కవిత లేఖ

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు రిజర్వేషన్లు 42% పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని MLC కవిత విమర్శించారు. కులగణన వివరాలను ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయలేదని సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. కుంటి సాకులతో తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను సహించబోదని హెచ్చరించారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని కోరారు.

News January 23, 2025

అటవీశాఖలో మార్పులపై పవన్ ఫోకస్

image

AP: అటవీశాఖలో సమూల మార్పులపై Dy.CM పవన్ దృష్టి సారించారు. అటవీ భూముల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు యాక్షన్ ప్లాన్, అటవీ ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సిబ్బంది కొరతను తీర్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.

News January 23, 2025

రేపు ఉ.10 గంటలకు..

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు ఈ నెల 24న ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే తిరుమల, తిరుపతిలో ఆ నెలకు సంబంధించిన గదుల కోటాను రేపు మ.3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక శ్రీవారి సేవ కోటా టికెట్లను ఈ నెల 27న ఉ.11 గం.కు విడుదల చేయనున్నారు. దళారులను నమ్మవద్దని <>ttdevasthanams.ap.gov.in/<<>> లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని TTD సూచించింది.