News October 8, 2025
2050 నాటికి అతిపెద్ద చమురు వినియోగదారుగా భారత్: బ్రిటన్ ఎకనామిస్ట్

చమురు వినియోగంలో 2050 నాటికి భారత్ అన్ని దేశాలను అధిగమిస్తుందని బ్రిటిష్ ఎకనామిస్ట్ స్పెన్సర్ డేల్ అంచనా వేశారు. ఇది ప్రపంచ ఇంధన వినియోగంలో 12%కి పైగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ డిమాండ్ రోజుకు 5.4M బారెల్స్గా ఉండగా, 2050 నాటికి ఇది 9.1M bpdకి చేరుతుందన్నారు. అలాగే నేచురల్ గ్యాస్ వినియోగం రెట్టింపవుతుందన్నారు. కాగా ప్రస్తుతం IND మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా, వినియోగదారుగా ఉంది.
Similar News
News January 13, 2026
రిపబ్లిక్ డే.. దీపికకు ప్రెసిడెంట్ ఇన్విటేషన్

భారత అంధుల క్రికెట్ టీమ్ కెప్టెన్, ఏపీకి చెందిన దీపికకు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర వేడుకలకు రావాలంటూ ఆమెకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆహ్వానం పంపారు. శ్రీసత్యసాయి జిల్లాలోని తంబాలహట్టికి వెళ్లిన అధికారులు దీపికకు ఇన్విటేషన్ అందజేశారు. ఆమె కెప్టెన్సీలో భారత మహిళల అంధుల జట్టు ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో దీపికపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
News January 13, 2026
జిల్లాల పునర్విభజన ఇప్పుడు సాధ్యం కాదా?

TG: జిల్లాల పునర్విభజన చేపడతామన్న ప్రభుత్వ నిర్ణయానికి దేశవ్యాప్త జనగణన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. 2027 MAR 1 నుంచి జరిగే ఈ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాల సరిహద్దులు ఇప్పట్లో మార్చొద్దని గతంలో కేంద్రం సూచించింది. దీనివల్ల జనగణనలో ఇబ్బందులు ఏర్పడి, జిల్లాలవారీ లెక్కలు తీయడం సాధ్యం కాదని చెప్పింది. మరి పునర్విభజనకు ప్రభుత్వం రెండేళ్లు ఆగుతుందా? లేదంటే ఎలా ముందుకెళ్తుంది? అనేది ఆసక్తికరం.
News January 13, 2026
పందెం కోళ్లు.. పేర్లు తెలుసా?

AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలోని పలు చోట్ల బరులు, కాళ్ల బలం చూపించేందుకు కోళ్లు సిద్ధమయ్యాయి. నెలలుగా ప్రత్యేక శిక్షణ, ఆహారం ఇచ్చి రెడీ చేసిన తమ కోళ్లను బరిలో దించి గెలిచేందుకు యజమానులు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా సేతు, కాకి, డేగ, నెమలి, పర్ల, రసంగి, కిక్కిరాయి, మైల, పింగళి, అబ్రాస్ రకాలను బరిలో దించుతుంటారు. కోళ్ల ఈకల రంగు, మెడ, కాళ్ల సైజు, శరీర తత్వాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు.


