News February 9, 2025
INDvsENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్

కటక్లో జరగనున్న వన్డే మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్కు దూరమైన కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చారు. వరుణ్ చక్రవర్తి వన్డేల్లోకి అరంగేట్రం చేస్తున్నారు.
భారత జట్టు: రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, అక్షర్, రాహుల్, పాండ్య, జడేజా, వరుణ్, హర్షిత్, షమీ
ఇంగ్లండ్ జట్టు: డకెట్, సాల్ట్, రూట్, బ్రూక్, బట్లర్, లివింగ్స్టోన్, ఓవర్టన్, ఆట్కిన్సన్, రషీద్, మార్క్ వుడ్, సకీబ్
Similar News
News March 16, 2025
విద్యార్థులూ.. విజయీభవ: నారా లోకేశ్

AP: పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోండి. ఎటువంటి ఒత్తిడికి గురికావద్దు. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే సమయం ఇది. ప్రశాంతంగా ఉండండి. సకాలంలో పరీక్ష పూర్తి చేయండి. విజయీభవ’ అని పేర్కొన్నారు.
News March 16, 2025
‘పుష్ప-3’ రిలీజ్ అయ్యేది అప్పుడే: నిర్మాత

‘పుష్ప-3’ సినిమాను 2028లో రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ‘రాబిన్ హుడ్’ ప్రెస్మీట్లో ఆయన పాల్గొన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప, 2024లో రిలీజైన ‘పుష్ప-2’ సూపర్ హిట్లుగా నిలవగా, ‘పుష్ప-2’ రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే.
News March 16, 2025
భూమిపైకి సునీతా విలియమ్స్.. ఎప్పుడంటే

వారం రోజుల మిషన్పై వెళ్లి 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపై అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 19న భూమికి తిరిగి రానున్నారు. వీరు ప్రయాణించే డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానుంది. దీంతో వ్యోమగాములిద్దరూ క్షేమంగా తిరిగిరావాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కోరుకుంటున్నారు.