News March 25, 2024
కృష్ణా జలాల పంపిణీపై 8 నుంచి విచారణ

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై వచ్చే నెల 8 నుంచి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ ప్రారంభించనుంది. తెలంగాణ విజ్ఞప్తితో నీటి పునఃపంపిణీకి ట్రైబ్యునల్ గత ఏడాది విధివిధానాలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. పరీవాహక ప్రమాణాలను అనుసరించి తమకు 789 TMCలు లేదా కనీసం 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 555 TMCలు ఇవ్వాలని తెలంగాణ SOC(స్టేట్మెంట్ ఆఫ్ కేస్) సమర్పించింది. ఏపీ వారంలో SOC దాఖలు చేయనుంది.
Similar News
News December 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 10, 2025
ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 10, 2025
వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.


