News August 5, 2024
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: CM రేవంత్

తెలంగాణకు అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు CM రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ‘మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్గా లభిస్తుంది’ అని వారితో అన్నారు.
Similar News
News December 7, 2025
KMR: ఆ మండలాల్లో ప్రచార పర్వానికి 3 రోజులే!

కామారెడ్డి జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి 3రోజుల్లో తెరపడనుంది. ఈ నెల 9 సాయంత్రం 5గం.లోపు బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారాన్ని ముగించాల్సిందే. భిక్కనూర్, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో 167 గ్రామ పంచాయతీలకు గాను 11 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 156 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.
News December 7, 2025
మీ తోబుట్టువును గౌరవిస్తున్నారా?

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బానధవా|
తం తు దేశం న పశ్యామి యత్ర బాత్రా సహోదరా||
సహోదరుల బంధం గురించి రాముడు పలికిన మాటలివి. ఈ బంధం విశ్వంలో ఎక్కడా దొరకనంత అమూల్యమైనదని దీనర్థం. సోదరులతో చిన్న మనస్పర్ధలు వచ్చినా, సరిచేసుకుని కలిసి ఉండాలి. ఎక్కడికెళ్లినా భార్యలు, బంధువులు దొరుకుతారు కానీ, తోబుట్టువు దొరకరు. అందుకే ఈ బంధాన్ని దేంతో పోల్చలేము. అంత అపురూపమైనది. ఈ బంధాన్ని ఎల్లప్పుడూ గౌరవించుకోవాలి.
News December 7, 2025
బేబీ గ్రోత్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

తల్లి గర్భంలో పిండం ఎదుగుదల తెలుసుకోవడానికి ముందు వయసు సరిగా నిర్ధారించుకోవాలి. మూడు నెలలకు ఓసారి స్కాన్ చేయించాలి. తల్లి అధిక బరువు ఉన్నా, బరువు తక్కువగా ఉన్నా..35 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల పిండం బరువు పెరగక పోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిండం ఎదగనప్పుడు కొన్ని సమస్యలు కనిపిస్తాయి. తల్లి కడుపు నుంచి రక్తం ఆగి ఆగి వెళ్లడంగానీ వెనక్కి వచ్చినా పిండం కడుపులోనే చనిపోవచ్చు.


