News June 19, 2024

జగన్ ఆస్తుల కేసుల విచారణ వాయిదా

image

హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జగన్ ఆస్తుల కేసుల విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. గతంలో సీఎంగా ఉండటంతో విచారణలో వాయిదాలు కోరుతూ వచ్చిన జగన్ ఇప్పుడు విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

Similar News

News January 16, 2026

173 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

NCERTలో 173 పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పెంచారు. అర్హతగల వారు జనవరి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in

News January 16, 2026

282 పోస్టులు.. అప్లై చేశారా?

image

CSI ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్‌ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జిల్లా కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 4, తెలంగాణలో 11 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cscspv.in

News January 16, 2026

కనుమ – ముక్కనుమ: తేడాలేంటి?

image

నేడు కనుమ. రేపు ముక్కనుమ. ఈ పండుగలు పల్లె సంస్కృతికి అద్దం పడతాయి. కనుమ నాడు వ్యవసాయానికి చేదోడుగా నిలిచే పశువులను పూజించి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇక ముక్కనుమ పండుగ ముగింపు సంబరం. ఈరోజున పశువులను చెరువులలో శుభ్రంగా కడిగి విశ్రాంతినిస్తారు. కనుమ రోజున శాకాహారానికి ప్రాధాన్యత ఉంటే, ముక్కనుమ నాడు మాంసాహార విందులు, గ్రామ దేవతల ఆరాధన, బొమ్మల నోము వంటి కార్యక్రమాలతో పండుగకు ఘనంగా ముగింపు పలుకుతారు.