News February 21, 2025
తరచూ ఫోన్లు ఛేంజ్ చేస్తున్న ఐఫోన్ ప్రో యూజర్లు

ఐఫోన్ ప్రో యూజర్లు తరచూ ఫోన్లు మారుస్తున్నట్లు టెక్నాలజీపై రీసెర్చ్ చేసే కౌంటర్పాయింట్ సర్వే వెల్లడించింది. US, చైనా, IND, UKలో సర్వే చేసి ఐఫోన్ ప్రో యూజర్లు సరాసరి 2.75ఏళ్లకు, రెగ్యులర్ ఐఫోన్స్ వాడేవారు 3.15ఏళ్లకు కొత్త మోడల్కు అప్గ్రేడ్ అవుతున్నారంది. మరోవైపు ఐఫోన్ యూజర్స్ పెరుగుతుండడంతో ఆండ్రాయిడ్ మొబైల్ కంపెనీలు నష్టపోతున్నట్లు పేర్కొంది. మీ ఫోన్ ఎప్పటి నుంచి వాడుతున్నారో COMMENT చేయండి.
Similar News
News March 26, 2025
శ్రేయస్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ ప్రశంసలు

PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది కాలంలో అయ్యర్ తన ఆటను అద్భుతంగా మెరుగుపర్చుకున్నాడన్నారు. ప్రస్తుతం అతను అన్ని ఫార్మాట్లకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొన్ని ఇష్యూస్ తర్వాత ఆటను ఇంప్రూవ్ చేసుకున్న తీరు గొప్పగా ఉందని పేర్కొన్నారు. నిన్న గుజరాత్తో మ్యాచ్లో అయ్యర్ 97* పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
News March 26, 2025
బాత్రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు?

కొందరు అరగంట సేపైనా బాత్రూమ్లోనే ఉండిపోతూ కాలక్షేపం చేస్తుంటారు. టాయిలెట్ కమోడ్పై కూర్చొని రీల్స్ చూస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడంతో పాయువు దగ్గర కండరాలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఇన్ఫెక్షన్లు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. టాయిలెట్లో ఎక్కువ సేపు ఫోన్ చూడటంతో మెడ, వెన్ను నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అందుకే వెళ్లిన పనిని త్వరగా కానిచ్చి బయటపడాలంటున్నారు.
News March 26, 2025
కరిగిపోతున్న మంచు.. పెను ప్రమాదంలో చైనా?

చైనా మంచినీటి వనరులైన హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. 1960 నుంచి సుమారు 7వేలకు పైగా(సుమారు 26శాతం) మంచుదిబ్బలు మాయమైపోయాయని అంచనా. దీంతో తాగునీటి విషయంలో పెను సమస్యలు తప్పవని చైనా పర్యావరణవేత్తలు ఆందోళనగా ఉన్నారు. టిబెట్, షింజియాంగ్ ప్రావిన్సుల్లో అత్యధికంగా హిమానీనదాలున్నాయి. వాటిని కాపాడేందుకు చైనా పలు మార్గాల్ని అన్వేషిస్తున్నా ఫలితం దక్కడం లేదు.