News May 15, 2024

IPL: లక్నోపై ఢిల్లీ గెలుపు

image

ఢిల్లీలో ఈరోజు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నోపై ఢిల్లీ గెలుపొందింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 189 పరుగులకే పరిమితమైంది. పూరన్(61), అర్షద్ (58) రాణించారు. రన్ రేట్ పేలవంగా ఉన్న లక్నో.. మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ ఐపీఎల్ నుంచి దాదాపు నిష్క్రమంచినట్లే. ఢిల్లీ 14 పాయింట్లకు చేరుకున్నా నెగిటివ్ రన్ రేట్ కారణంగా ఇతర ఫలితాల మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉంది.

Similar News

News December 5, 2025

పవనన్నకు థాంక్స్: లోకేశ్

image

AP: చిలకలూరిపేట ZPHSలో నిర్వహించిన మెగా PTM 3.Oకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌కు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘హైస్కూలు లైబ్ర‌రీకి పుస్త‌కాలు, ర్యాక్‌లు, 25 కంప్యూట‌ర్లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న‌న్న‌కు ధ‌న్య‌వాదాలు. ఏపీ మోడ‌ల్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ ద్వారా మ‌న విద్యావ్య‌వ‌స్థ‌ను 2029 నాటికి దేశంలోనే నంబర్ వ‌న్‌గా తీర్చిదిద్దేందుకు Dy.CM అందిస్తున్న స‌హ‌కారం చాలా గొప్పది’ అని ట్వీట్ చేశారు.

News December 5, 2025

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

image

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.

News December 5, 2025

కప్పు పట్టేస్తారా? పట్టు విడుస్తారా?

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన IND 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచు గెలిచి ఊపు మీద కనిపించింది. దీంతో ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్నారంతా. కానీ బౌలింగ్ ఫెయిల్యూర్, చెత్త ఫీల్డింగ్‌తో రెండో వన్డేను చేజార్చుకుంది. దీంతో రేపు విశాఖలో జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. మరి భారత ఆటగాళ్లు ఈ మ్యాచులో సమష్టిగా రాణించి, సిరీస్ పట్టేస్తారో లేక SAకు అప్పగిస్తారో చూడాలి.