News March 20, 2025
ఐపీఎల్లో తొలి మ్యాచ్కు వర్షం ముప్పు?

IPL ఫ్యాన్స్కు తొలి మ్యాచ్లోనే నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో KKR, RCBకి మధ్య ఎల్లుండి జరగనున్న మ్యాచ్కు వర్షం ముప్పు 90శాతం మేర ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో వచ్చే కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఒకవేళ వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ రద్దైతే ఇరు జట్లూ పాయింట్లు పంచుకుంటాయి.
Similar News
News April 19, 2025
ఒకే రోజు ఓటీటీ, టీవీల్లోకి కొత్త సినిమా?

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ ZEE5లో మే 2 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజున జీ తెలుగు ఛానల్లోనూ రానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. వార్నర్ గెస్ట్ రోల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. అంతకుముందు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఒకే రోజున OTT, టీవీల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
News April 19, 2025
ఔరంగజేబు క్రూరుడని నెహ్రూయే అన్నారు: రాజ్నాథ్ సింగ్

మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ వంటివాళ్లు దేశానికి ఆదర్శం కానీ ఔరంగజేబులాంటివారు కాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘శౌర్యానికి, దేశభక్తికి మహారాణా ప్రతాప్ ఓ ప్రతీక. ఆయన్నుంచి స్ఫూర్తి పొంది శివాజీ మొఘలులపై పోరాడారు. ఔరంగజేబు పరమ క్రూరుడని నెహ్రూయే స్వయంగా అన్నారన్న విషయం అందరూ తెలుసుకోవాలి. రాణా, శివాజీ ఇద్దరూ మొఘలులకు మాత్రమే వ్యతిరేకం. ముస్లింలకు కాదు’ అని పేర్కొన్నారు.
News April 19, 2025
ట్రంప్ వద్దంటున్నా.. ఇరాన్పై దాడికే ఇజ్రాయెల్ మొగ్గు

ఇరాన్పై దాడి వద్దని ఓవైపు అమెరికా వారిస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే నెలల్లో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఇరాన్కు అణ్వస్త్ర సామర్థ్యం ఉండొద్దనేదే తమ లక్ష్యమని వివరించారు. అటు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ను దాడి చేయొద్దని వారిస్తున్నట్లు తెలుస్తోంది.