News April 2, 2024
ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి

హమాస్ ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్లో ఉన్న ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఇరాన్కు చెందిన సీనియర్ మిలిటరీ సలహాదారు అలీ రెజా సహా ఏడుగురు మృతి చెందారు. కాగా అలీ రెజా 2016 వరకు లెబనాన్, సిరియా దేశాల్లో ఖుడ్స్ బలగాలకు నేతృత్వం వహించారు. కాగా ఇజ్రాయెల్ ప్రతిదాడి ఎదుర్కోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది.
Similar News
News February 18, 2026
నెల్లూరు జిల్లా లాడ్జీల్లో తనిఖీలు

ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి లాడ్జీలు, హోటల్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. రాత్రి వేళల్లో లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించారు. వారి వివరాలను ఆరా తీశారు.
News February 18, 2026
హోలీ కానుకగా డీఏ పెంపు?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీ(మార్చి 4) కానుకగా DA పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం DA 58% ఉండగా మరో 2% పెరగొచ్చని అంచనా. ఇది JAN నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2000 సంవత్సరంలో ఒక శాతం డీఏ పెరగ్గా, ఈ ఏడాది పెంపు రెండో అత్యల్పం అవుతుంది. 2007, 2018, 2025లోనూ రెండు శాతమే నమోదైంది. కాగా <<18718812>>8వ వేతన సంఘం<<>> ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
News February 17, 2026
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

TG: HYD, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మార్చి చివరికి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ‘నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారి నివాస ప్రాంతాల్లో 5-10 అంతస్తుల్లో గృహాల నిర్మాణానికి యోచిస్తున్నాం. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకూ అర్హులను ఎంపిక చేస్తాం’ అని పేర్కొన్నారు.


