News March 27, 2024

పెద్దిరెడ్డికి ఇసుకే టిఫిన్.. మైన్స్ మధ్యాహ్న భోజనం: CBN

image

AP: బాబాయిని గొడ్డలితో చంపిన వ్యక్తులతో జగన్ తిరుగుతున్నారని మదనపల్లె ప్రజాగళం సభలో చంద్రబాబు ఆరోపించారు. ‘మంత్రి పెద్దిరెడ్డికి ఇసుకే ఉదయం అల్పాహారం. మైన్స్ మధ్యాహ్న భోజనం. అన్నమయ్య జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన సాగుతోంది. కాంట్రాక్టులన్నీ ఆయనే తీసుకుని, ఇసుకను అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నారు. రౌడీయిజం కావాలో? ప్రజాస్వామ్యం కావాలో? ప్రజలే తేల్చుకోవాలి’ అని చంద్రబాబు అన్నారు.

Similar News

News February 19, 2026

భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

image

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.

News February 19, 2026

భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

image

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.

News February 19, 2026

ఉత్కంఠ పోరు.. భారత్ విజయం

image

T20WC: నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచులో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టీమ్ ఇండియా 20 ఓవర్లలో 193/6 రన్స్ చేయగా నెదర్లాండ్స్ 176/7 పరుగులు చేసింది. 19వ ఓవర్లో 18 రన్స్ రావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే చివరి ఓవర్ దూబే కట్టుదిట్టంగా వేయడంతో భారత్ గెలిచింది. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో సత్తా చాటారు. ఫిబ్రవరి 21 నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది.