News June 21, 2024

మోసంతో గెలవడం కంటే యోధునిగా ఓడటం మేలు: పూనమ్ కౌర్

image

నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కుట్రలు, మోసాలతో గెలవడం కంటే యోధునిగా ఓడిపోవడం మేలు అని రాసుకొచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల గురించే ఆమె పోస్టు చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈవీఎంల గురించి చర్చ జరుగుతున్న వేళ పూనమ్ ఇలా స్పందించారని పేర్కొంటున్నారు.

Similar News

News January 22, 2026

నవజాత గొర్రె పిల్లల మరణాలకు కారణం ఏమిటి?

image

నవజాత గొర్రె పిల్లల మరణాలు పెంపకందారులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పుట్టిననాటి నుంచి 28 రోజుల వయసు కలిగిన గొర్రె పిల్లలను నవజాత పిల్లలుగా పరిగణిస్తారు. నవజాత పిల్లల మరణాల్లో దాదాపు 35 శాతం అవి పుట్టినరోజే సంభవిస్తాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. గొర్రెల పెంపకందారుల నిర్లక్ష్యం, వ్యాధికారక క్రిములు, సూక్ష్మజీవులు, పరాన్న జీవులు సోకడమే ఈ మరణాలకు కారణమని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

News January 22, 2026

ఎండోమెంట్ వ్యవసాయేతర భూముల లీజును తప్పుబట్టిన హైకోర్టు

image

AP: దేవాలయ వ్యవసాయేతర భూములను సుదీర్ఘకాలం లీజుకు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఛారిటీ సంస్థలకు భూముల్ని లీజుకు ఇచ్చేలా ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.15ను నిలిపివేసింది. దేవదాయ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు వాదించగా, ఇప్పటికే లీజులు పొందిన వారిని ఖాళీ చేయించడం కష్టతరంగా మారిందని AG వాదించారు. అనంతరం కోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

News January 22, 2026

WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా

image

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అధికారికంగా వైదొలిగేందుకు అమెరికా సిద్ధమైంది. ట్రంప్ 2025లో పదవిలోకి వచ్చిన తొలి రోజే ఈ విషయాన్ని ప్రకటించారు. WHO నిధుల్లో సుమారు 18% USAనే ఫండింగ్ ఇచ్చేది. అమెరికా వెళ్లిపోతే ఆ సంస్థకి భారీ ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ ఇవ్వాల్సిన బకాయిలు ($260M) చెల్లించకుండానే US నిష్క్రమిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.