News July 5, 2024

ఖైదీని కలిసేందుకు జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారు: హోం మంత్రి

image

AP: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోం మంత్రి అనిత ఆరోపించారు. హెలికాప్టర్‌లో జగన్ నెల్లూరు జైలుకు వెళ్లారన్నారు. పిన్నెల్లిని కలిసేందుకు ములాఖత్‌లు అయిపోయినా.. మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతిచ్చామన్నారు. పిన్నెల్లి ఈవీఎంలు పగులగొట్టడం, దాడులు చేయడం సీసీ టీవీల్లో రికార్డయ్యాయని.. అయినా జగన్ అక్రమంగా అరెస్ట్ చేశారనడం దారుణమన్నారు.

Similar News

News December 17, 2025

చేతిలో డబ్బు నిలవాలంటే..

image

ధనం వస్తూ ఖర్చు అవుతూ ఉంటే, ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క దగ్గర రోజూ సాయంత్రం దీపం వెలిగించాలి. ప్రతి సోమవారం శ్రీసూక్తం పఠిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలాగే, శ్రీయంత్రం, కనకధారా యంత్రం, కుబేర యంత్రం ఈ మూడింటిని పూజా మందిరంలో ఉంచి, రోజూ పూజిస్తే లక్ష్మీకటాక్షం లభించడం తథ్యం. ఇలా చేయడం ద్వారా డబ్బు నిలవక పోవడం అనే సమస్య తగ్గుతుంది.

News December 17, 2025

సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>CSIR<<>>-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 44 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 26వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.36,918-రూ.67,530 చెల్లిస్తారు. వెబ్‌సైట్: cdri.res.in

News December 17, 2025

ముగిసిన పోలింగ్.. కాసేపట్లో ఫలితాలు

image

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. చివరి విడత పోలింగ్ పూర్తయింది. 3,752 సర్పంచ్ స్థానాల్లో 12,652 మంది, 28,410 వార్డు స్థానాల్లో 75,725 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. మ.2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అధికారులు ఆ వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో రాష్ట్రంలో దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియకు తెర పడనుంది.