News April 3, 2024
రేపటి నుంచి జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు

JEE మెయిన్ సెషన్-2 పరీక్షలు రేపటి నుంచి ఈనెల 12 వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, 291 నగరాల్లో 544 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50వేల మంది విద్యార్థులు రాయనున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు మొదటి షిఫ్ట్, మ.3 నుంచి సా.6 వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరగనున్నాయి. ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
Similar News
News February 12, 2026
ఫిబ్రవరి 12: చరిత్రలో ఈరోజు

➤ 1809: బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జననం
➤ 1809: అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జననం
➤ 1824: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జననం
➤ 1961: శుక్ర గ్రహంపైకి తొలిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1)
➤ 1962: సినీ నటుడు జగపతిబాబు జననం(ఫొటోలో)
➤ 1968: నటుడు పువ్వుల సూరిబాబు మరణం
➤ 2019: సినీ దర్శకుడు విజయ బాపినీడు మరణం
News February 12, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 12, 2026
భారత్లో రషీద్ ఖాన్ రికార్డు

భారత్ వేదికగా జరిగిన అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్గా అఫ్గానిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ నిలిచారు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో చాహల్(49), అక్షర్(48), అర్ష్దీప్(43), హార్దిక్ పాండ్య(38), బుమ్రా(36), భువనేశ్వర్(34), వరుణ్(34) ఉన్నారు. ఇక ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో రషీద్ ఖాన్ 113 మ్యాచుల్లో 190 వికెట్లు తీశారు.


