News August 14, 2025
JGTL: ‘శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి’

గణేష్ నవరాత్రుల సందర్భంగా అధిక స్థాయిలో శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజేలు, భారీ సౌండ్ సిస్టంల వినియోగం పూర్తిస్థాయిలో నిషేధమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ విషయంలో గణేష్ మండప నిర్వహకులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనమతులు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 15, 2026
భువనగిరి జిల్లాకు 190 యూనిట్లు మంజూరు: కలెక్టర్

షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళిక (2025-26) కింద జిల్లాకు 190 బ్యాంకు సంబంధిత యూనిట్లు మంజూరైనట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. రూ.382 లక్షలతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని శనివారం పేర్కొన్నారు. ఈ పథకానికి అర్హతగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News March 15, 2026
హిందూపురంలో నేడు జాబ్ మేళా

హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. దాదాపు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నదే ఎమ్మెల్యే బాలకృష్ణ లక్ష్యమని ఆయన పీఏలు సురేంద్ర, వీరయ్య తెలిపారు. నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ కోరారు.
News March 15, 2026
అనకాపల్లి: QR కోడ్ స్కాన్ చేసి సెంటర్ వివరాలు తెలుసుకోండి..

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్స్పై ప్రత్యేకంగా క్యూర్ కోడ్ ముద్రించారు. ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే విద్యార్థుల పరీక్ష కేంద్రానికి వెళ్లే దారితో పాటు వివరాలు తెలుస్తాయని కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం సుకుమార్ తెలిపారు. దీనివల్ల పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కునే ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.


