News May 7, 2025

కశ్మీరీ పండిట్లు, రైల్వే ఆస్తులే ఉగ్రమూకల లక్ష్యం!

image

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీరీ పండిట్లతోపాటు అక్కడ పనిచేసే స్థానికేతరులు, రైల్వే ఆస్తులను టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు అంచనా వేశాయి. పాక్ ISI ఆదేశాలతో దాడులు చేయొచ్చని గుర్తించాయి. ఈ మేరకు ఆయా వర్గాలను, భద్రతా సిబ్బందిని, RPFను అప్రమత్తం చేశాయి. దీంతో రైల్వే సిబ్బంది మార్కెట్లకు వెళ్లొద్దని, తమ బ్యారక్‌ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

Similar News

News February 13, 2026

జగిత్యాలలో జీవన్‌రెడ్డి అనుచరుల హవా!

image

TG: INCలో వివాదంగా మారిన జగిత్యాల మున్సి‘పోల్స్’లో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అనుచరులు రెబల్స్‌గా పోటీచేసిన అన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 50 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. BRS MLA సంజయ్ అనుచరులకు పార్టీ టిక్కెట్లు దక్కడంతో జీవన్ రెడ్డి అనుచరులు 14 చోట్ల పోటీచేశారు. వాటన్నిటిలోనూ విజయం సాధించారు. ఇక ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో INC 12, BJP 4, BRS 4, MIM 2 వార్డులను దక్కించుకున్నాయి.

News February 13, 2026

కోళ్లలో కొక్కెర వ్యాధిని ఇలా గుర్తించండి

image

కొక్కెర వ్యాధి సోకిన కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గి, శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లు బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3-4 రోజుల్లో మరణిస్తాయి.

News February 13, 2026

image

https://d29i5havsxvi1j.cloudfront.net/elecresult/election-result-2024.html?lang_id=1&states=Telagana%20Muncipal%20Election%20Results,Telangana%20Corporation%20Election%20Results