News December 16, 2024

KGBVలకు డైట్ ఛార్జీలు వర్తింపజేయాలి: కవిత

image

KGBVలకు కూడా పెంచిన డైట్ ఛార్జీలను వర్తింపజేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె సారంగపూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి మాట్లాడారు. పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింప జేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరికీ పౌష్ఠికాహారం అందించాలని కోరారు.

Similar News

News January 19, 2025

ఎంపీ అర్వింద్‌కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటు: కవిత

image

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరని, కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రి చాటు బిడ్డగా ఉన్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్ వెకిలి మాటలు మాట్లాడడం మానేయాలని ఆమె సూచించారు.

News January 19, 2025

NZB: నేడు జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

image

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం NZB రానున్నారు. రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్‌కు చేరుకునే ఆయన అక్కడ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30కు పోలీస్ కమిషనరేట్‌లో భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రూ.380 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసి గూపన్పల్లిలో, నగరంలో బహిరంగ సభల్లో మాట్లాడి హైదరాబాద్ తిరుగపయనమవుతారు.

News January 19, 2025

నేడు నిజామాబాద్‌కు డీజీపీ

image

తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) డాక్టర్ జితేందర్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వెనుక ఏర్పాటు చేస్తున్న భరోసా సెంటర్‌ను మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో DGP పాల్గొంటారు. ఇందు కోసం జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది.