News March 27, 2024

KMM: అడుగంటిన జలాలు.. ఎండుతున్న పంటలు

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. 2,3 బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తడి లేక పంట ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో 500 అడుగుల మేర తవ్వినా నీటి జాడ లభించకపోవడం గమనార్హం. దీంతో ఆరు తడులతో ఎలాగో నెట్టుకొస్తున్నామని రైతన్నలు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో మున్ముందు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

Similar News

News February 10, 2026

నిబంధనల మేరకే విధులకు హాజరు కావాలి: సీపీ

image

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి, క్రమశిక్షణతో పనిచేసి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

News February 10, 2026

ఖమ్మం: దివ్యాంగులకు అలర్ట్.. దరఖాస్తుకు నేడే ఆఖరు!

image

దృష్టి, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులు ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి వెల్పుల విజేత తెలిపారు. అర్హులు ఈ సాయంత్రంలోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువు దాటిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని ఆమె స్పష్టం చేశారు.

News February 10, 2026

ఖమ్మం: తెలంగాణ పోరాట యోధురాలు మృతి

image

తెలంగాణ పోరాట యోధురాలు గండూరి నర్సు బాయమ్మ మరణించారు. ఖమ్మం పరిధి మామిండ్ల గూడెంలో నివాసం ఉంటున్న ఆమె అనారోగ్యంతో మృతిచెందారు. కాగా ఆమె భర్త, సీపీఎం నేత గండ్లూరి కిషన్‌రావు 1976లో మామిండ్లగూడెంలోని తన ఇంటి సమీపంలోనే హత్యకు గురయ్యారు. ఆమె గతంలో ముదిగొండ మండలం బాణాపురం సర్పంచ్‌గా పని చేశారు. నర్సు బాయమ్మ మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.