News April 13, 2024
KMM: రక్తంతో ‘గుమ్మడి’ చిత్రపటం

ఇల్లెందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య చిత్రపటాన్ని తన రక్తంలో గీయించి ఫ్రేమ్ కట్టిచాడు ఓ వీరాభిమాని. సెలబ్రేటీలకే వీభిమానులు ఉన్న ఈ రోజుల్లో 5సార్లు MLAగా చేసి నేటికీ సాధారణ జీవితం గడుపుతున్న గుమ్మడికి తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన వెంకటేశ్ వీరాభిమానిగా మారాడు. ఆ అభిమానంతోనే అలాంటి నేత కోసం తన రక్తంతో చిత్రపటం గీయించి ఆయన ఆదర్శాలను అందరికీ చాటిచెప్పాలని భావించినట్లు వెంకటేశ్ చెప్పారు.
Similar News
News December 17, 2025
ఖమ్మం జిల్లాలో.. 168 జీపీలకు నేడే పోలింగ్

ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 191 గ్రామ GPలకు గానూ 22 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 168 జీపీలకు నేడు పోలింగ్ జరగనుంది. ఏన్కూరు(21), కల్లూరు(23), పెనుబల్లి(32), సత్తుపల్లి(21), తల్లాడ (27), వేంసూరు (26), సింగరేణి(41) మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు.
* GP ఎలక్షన్ల అప్డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.
News December 16, 2025
ఖమ్మం: 18 నుంచి 22 వరకు రేషన్ బియ్యం

ఈ నెల 18 నుంచి 22 వరకు రేషన్ షాపులలో బియ్యం లభ్యత ఉంటుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. పోర్టబిలిటీ బియ్యం కోసం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేశామని, రేషన్ లబ్ధిదారులు ఈ తేదీల్లో వారికి సమీపంలో గల దుకాణాల నుంచి పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలని ఆయన కోరారు.
News December 16, 2025
మూడో విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో రేపు జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సింగరేణిలోని ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు, కౌంటింగ్ 2 గంటల నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.


