News February 16, 2025
KMR: అప్పుల బాధ..ఒకే రోజు ఇద్దరి సూసైడ్..!

గాల్లో దీపాల్లా..వ్యక్తుల జీవితాలు మారిపోయాయి. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ..ఆ కుటుంబాల్లో పుట్టెడు దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. కామారెడ్డి జిల్లాలో శనివారం ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఇల్లు నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక.. రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లిలో నర్సింలు సూసైడ్ చేసుకోగా..కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక బుడ్మి వాసి జీవన్ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Similar News
News April 14, 2026
ఏలూరు: డ్వాక్రా 13.64 కోట్ల రుణాల పంపిణీ

ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం డ్వాక్రా మహిళలకు రూ.13.64 కోట్ల రుణాలను జేసీ అభిషేక్ గౌడ్, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్, డీఆర్డీఏ ద్వారా మంజూరైన ఈ నిధులను మహిళలు ఆర్థికాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మొక్కంటి, పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.
News April 14, 2026
ఇంజెక్షన్ల రీయూజ్.. పాక్లో 331 మంది చిన్నారులకు HIV!

పాకిస్థాన్లోని టౌన్సాలో THQ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చిన్నారులను బలితీసుకుంటోంది. ఇంజెక్షన్ల కోసం వాడిన సిరెంజ్లనే మళ్లీ ఉపయోగించడంతో
331 మంది చిన్నారులు HIV బారిన పడినట్లు బీబీసీ దర్యాప్తులో తేలింది. 2024 నవంబరు నుంచి 2025 అక్టోబరు మధ్య ఈ కేసులు నమోదయ్యాయి. కాగా వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం ఖండిస్తోంది.
News April 14, 2026
సీఎం పదవికి నితీశ్ రాజీనామా

ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్ను గవర్నర్కు అందజేశారు. మరికాసేపట్లో బీజేపీ కొత్త సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించనుంది. బిహార్కు నితీశ్ 21 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ రాష్ట్రంలో 243 అసెంబ్లీ సీట్లు ఉండగా NDAకు 202 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.


