News August 20, 2025
KMR: జిల్లా విద్యార్థులకు తృతీయ బహుమతి

హైదరాబాద్ T-HUB, హైటెక్ సిటీలో జరిగిన ఇండియన్ స్పేస్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్-2025 పోటీల్లో 100 పాఠశాలలు పాల్గొన్నాయి. ERUDITE సంస్థ ఆధ్వర్యంలో రాకెట్ లాంచింగ్ వెహికల్స్ విభాగంలో కామారెడ్డికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్ట్ రూపొందించి తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మహతి, కేయూరి, సునేన్, శ్రీనిధిలను పాఠశాల యాజమాన్యం అభినందించారు.
Similar News
News January 17, 2026
అధైర్యపడొద్దు.. కార్యకర్తలకు రాజ్ ఠాక్రే పిలుపు

ముంబై మున్సిపల్ ఎన్నికల <<18877157>>ఫలితాల<<>> నేపథ్యంలో MNS అధినేత రాజ్ ఠాక్రే తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘మనం అపారమైన డబ్బు, అధికార బలంతో తలపడ్డాం. ఆశించిన ఫలితం రాకపోయినా అధైర్యపడొద్దు’ అని భరోసానిచ్చారు. మరాఠీ భాష, అస్తిత్వం కోసం పోరాడటమే మన ఊపిరి అని, గెలిచిన వారు ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. లోపాలను సరిదిద్దుకుని మళ్లీ అధికారంలోకి వద్దామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
News January 17, 2026
ADB: ఆదర్శ పాఠశాల అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల

ఉమ్మడి ADB జిల్లాలో 14 మోడల్ పాఠశాలలో 2026- 27 సం.రానికి సంబంధించి 6వ తరగతి, 7- 10 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. JAN 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్ టికెట్లు ఏప్రిల్ 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. వివరాల కోసం https://tgms .telangana.gov.inలో సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
News January 17, 2026
HYD: ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు

HYDలో డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వైస్ ఛాన్స్లర్ ఘంటా చక్రపాణి తెలిపారు. డిగ్రీ చదువుతున్న 690 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో అవసరమైన నైపుణ్యాలు పెంపొందించి, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.


