News September 13, 2025
KMR: జోరుగా గంజాయి సాగు, విక్రయాలు

జుక్కల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో పలువురు అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. హంగర్గ గ్రామంలో కంది, ఇతర పంటలతో పాటు ఓ రైతు సాగు చేసిన 147 గంజాయి మొక్కలను సాగు చేయగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు గంజాయి సాగు చేస్తూ, పలుచోట్ల విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడక్కడా అధికారులు దాడులు చేస్తున్నపట్టికీ గంజాయి సాగు, విక్రయాలు మాత్రం తగ్గడం లేదు.
Similar News
News December 5, 2025
స్క్రబ్ టైపస్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఎం

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో స్క్రాబ్ టైపస్ కేసులు నమోదు అవుతున్న కారణంగా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీదేవి శుక్రవారం తెలిపారు. తలనొప్పి, జ్వరం, శరీరం మీద దద్దర్లు, కళ్లకలక వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపించదని తెలిపారు.
News December 5, 2025
నెల్లూరు: ప్రభుత్వ అధికారి సస్పెండ్

దుత్తలూరు-1 VROగా పని చేస్తున్న చింతలచెరువు శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను తహశీల్దార్ యనమల నాగరాజు వెల్లడించారు. గతంలో ఏరుకొల్లు VROగా పనిచేస్తున్న సమయంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడంతో పాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
News December 5, 2025
రాజమహేంద్రవరం: 7న ‘శ్రీ షిర్డిసాయి’లో స్కాలర్షిప్ టెస్ట్

పదో తరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆదివారం మెగా స్కాలర్షిప్ టెస్ట్, అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు శ్రీ షిర్డిసాయి విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య తెలిపారు. బీజపురి క్యాంపస్లో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. జేఈఈ, నీట్, సివిల్స్ కోర్సులపై నిపుణులు దిశానిర్దేశం చేస్తారని చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9281030301 నంబర్ను సంప్రదించాలన్నారు.


