News November 19, 2025
KMR: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులు బుధవారం నుంచి CCI కేంద్రాలకు పత్తిని తీసుకువెళ్లాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి సమస్యల పరిష్కారానికి మంగళవారం ఆయన కీలక సమావేశం నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు జిన్నింగ్ మిల్లర్లతో చర్చించారు. హామీలను నెరవేరుస్తామని చెప్పడంతో మిల్లుల యజమానులు బంద్ విరమించారని కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 15, 2026
సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఆర్టీసీ ఆంక్షలు

ఆర్టీసీ, పోలీస్ ఆదేశానుసారం రేపు నిర్మల్లో సీఎం సభ ఉన్నందున ఉదయం 11 నుంచి సభ అయిపోయే వరకు భైంసావైపు నుంచి వచ్చిపోయే బస్సులు ఈద్ ఘా చౌరస్తా వరకు, ఖానాపూర్, మంచిర్యాలవైపు నుంచి వచ్చిపోయే బస్సులు కొండాపూర్ బైపాస్ వరకు, నిజామాబాద్, హైదరాబాద్వైపు నుంచి వచ్చిపోయే బస్సులు సోఫీ నగర్ వరకు, ఆదిలాబాద్వైపు నుంచి వచ్చి వెళ్లే బస్సులు బైల్ బజార్ వరకు నడుపుతామని ఆర్టీసీ డీఎం పండరి తెలిపారు.
News January 15, 2026
దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్లో గుర్తుచేశారు.
News January 15, 2026
MBNR: ఓపెన్ SSC, INTER.. రేపే లాస్ట్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓపెన్ SSC, INTERలో చేరిన విద్యార్థులు ఎగ్జామ్ ఫీ చెల్లించాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఈ నెల 16లోగా (ఫైన్తో) ఎగ్జామ్ ఫీ ఆన్లైన్లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్లో సందర్శించాలన్నారు.
#SHARE IT


