News November 19, 2025
KMR: రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి: ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో నెలకొన్న తీవ్రమైన పొగమంచు నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. తక్కువ వీక్షణ సామర్థ్యం కారణంగా ఎదురు వాహనాలు, పాదచారులు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పొగమంచు సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News January 23, 2026
వర్సిటీల నిధులు, నియామకాలపై PUC ఛైర్మన్ సమీక్ష

రాష్ట్రంలో ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని PUC ఛైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అంబేడ్కర్ యూనివర్సిటీ, JNTU విజయనగరం, IIIT శ్రీకాకుళం యూనివర్సిటీల నిధుల వినియోగం, నియామకాలు, ఆదాయ-వ్యయాలు, పరిపాలనా పనితీరుపై సమీక్షించారు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు పూర్తిగా విద్యార్థుల మేలు కోసం వినియోగించాలన్నారు.
News January 23, 2026
ఈనెల 25 నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు!

మేడారం మహాజాతర భక్తుల కోసం ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు 290 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు హనుమకొండ డీఎం ధాంసింగ్ తెలిపారు. వరంగల్ తాత్కాలిక బస్ పాయింట్ నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150 కాగా, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. అలాగే, అగ్రహంపాడు జాతరకు కూరగాయల మార్కెట్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.
News January 23, 2026
భూమనపై రమణ విమర్శలు

విజయసాయిరెడ్డి నమ్మినవారికి వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడని, దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని టీటీడీ మాజీ సభ్యుడు ఓ.వి.రమణ ఆరోపించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. భూమన కరుణాకర్ రెడ్డి కరుణానంద స్వామిలా మారి శ్రీవారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి YCPకి రాజీనామా చేయడం జగన్ ఆడుతున్న డ్రామా అని, BJPలో చేరి కూటమిని విచ్ఛిన్నం చేయడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.


