News November 19, 2025
KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 19, 2026
గద్వాల్: 255 సర్పంచ్లకు 5 రోజుల పాటు శిక్షణ

గద్వాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన 255 మంది సర్పంచ్లకు నేటి నుంచి ప్రభుత్వం 5 రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించనున్నది. పారిశుద్ధ్యం, గ్రామసభలు, సమావేశాలు, వన మహోత్సవం, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, ప్రజా ఆరోగ్యం, నిధుల ఆడిట్, జనన, మరణాల నమోదు, ఆర్థిక ప్రణాళిక, ఈ -అప్లికేషన్స్ లాంటి 24 అంశాలపై శిక్షణ ఇవ్వడానికి ఎర్రవల్లి మండలం పదో బెటాలియాన్లో అధికారులు ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు.
News January 19, 2026
నల్గొండ: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

గట్టుప్పల్ మండలంలోని అంతంపేటలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన విద్యార్థిని నవ్య పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని నల్గొండలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె, తిరిగి హాస్టల్కు వెళ్లడం ఇష్టం లేక పురుగు మందు తాగింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
News January 19, 2026
మేడారంలో కొబ్బరికాయల సిండికేట్ మాఫియా!

మేడారం జాతరలో కొబ్బరికాయలు, బెల్లం, తలనీలాల కాంట్రాక్టుల్లో సిండికేట్ మాఫియా చక్రం తిప్పుతోంది. టెండర్లు లేకుండా కొబ్బరి కాయలను డబుల్ రేట్లకు రూ.60 చొప్పున జాతరలో విక్రయించడానికి నిర్ణయించారు. దాదాపు 60 లక్షల కొబ్బరికాయలు జాతరలో అమ్ముడవుతాయని అంచనా. కొబ్బరికాయల రూపంలో రూ.18 కోట్లు, తలనీలాలు రూ.15 కోట్లు, బెల్లం పేరిట రూ.30 కోట్లు టెండర్లు లేకుండా మాఫియా జేబులోకి వెళుతోందని తెలుస్తోంది.


