News August 23, 2025
KNR: ‘నిర్వాహకులు పోలీస్ వెబ్సైట్లో నమోదు చేయాలి’

గణేష్ నవరాత్రులు, మిలాద్ ఉల్ నబీ పండుగలను దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్ ఆడిటోరియంలో శాంతి కమిటీ సభ్యులతో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఈసారి నగరంలో సుమారు 3300 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు గణేష్ మండప వివరాలను పోలీస్ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
Similar News
News January 16, 2026
KNR: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యాంప్ కార్యాలయంలో గురువారం సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించగా, సిబ్బంది పండుగ వాతావరణంలో పాల్గొన్నారు.
News January 16, 2026
KNR: మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్ జిల్లా మైనారిటీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల పోస్టర్ను అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆవిష్కరించారు. 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగులు సీట్ల కోసం FEB 28లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 9 సంస్థల్లో ఉత్తమ బోధనతో పాటు IIT/NEET శిక్షణ ఇస్తారన్నారు.పూర్తి వివరాలకు www.tgmreistelangan.cgg.gov.in సంప్రదించాలన్నారు
News January 16, 2026
KNR: ఎన్నికల నగారా.. టికెట్ వేటలో ఆశావహులు

మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్లో రాజకీయ సందడి మొదలైంది. కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యేల ప్రాతినిధ్యంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో టికెట్ ఆశావహుల తాకిడి పెరిగింది. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు తమ గళాన్ని వినిపిస్తూ, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


