News September 10, 2025
KNR నుంచి అరుణాచలానికి RTC ప్రత్యేక బస్సు

అరుణాచలానికి KNR నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు KNR-1 DM విజయమాధురి తెలిపారు. ఈనెల 13న KNR బస్టాండ్ నుంచి బయలుదేరి 14న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనమనంతరం 15న అరుణాచలం నుంచి బయలుదేరి మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత 16న సాయంత్రం వరకు KNRకు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.4,700, పిల్లలకు రూ.3,540 ఛార్జీగా నిర్ణయించారు.
Similar News
News December 9, 2025
ప.గో జిల్లా ప్రజలారా.. ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి

ఉమ్మడి ప.గో జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ఏసీబీ డీఎస్పీ 9440446157, సీఐలు 9440446158, 9440446159, టోల్ ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయవచ్చాన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. (నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినం)
News December 9, 2025
సిద్దిపేట: 4 సార్లు ఓటమి.. అయిన సర్పంచ్ బరిలోకి!

బెజ్జంకి గ్రామ సర్పంచ్ పదవికి గతంలో నాలుగు సార్లు ఓటమి చెందిన కొండ్ల వెంకటేశం ఈసారి కూడా వెనుదీరగకుండా ఐదవసారి ఎన్నికల రణరంగంలోకి దిగారు. 1995, 2001, 2006, 2019లో ఓటమి చవిచూసిన ఆయన, ఇప్పుడు జరుగుతున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మళ్లీ బరిలోకి రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. తనకు ఉన్న సానుభూతితో తప్పకుండా విజయం సాధిస్తానని వెంకటేశం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News December 9, 2025
ఉమ్మడి గుంటూరులో స్క్రబ్ టైఫస్

గుంటూరు జిల్లా వెనిగండ్ల, నరసరావుపేట మండలం ములకలూరులలో స్క్రబ్ టైఫస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అనారోగ్యంతో జీజీహెచ్లో చేరిన ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు ఆయా గ్రామాల్లో ఫీవర్ సర్వేలు నిర్వహిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


