News December 1, 2025
KNR: ‘హెచ్ఐవీ తగ్గుముఖం.. ‘జీరో’ లక్ష్యంగా కృషి’

దేశంలో ఎయిడ్స్ తగ్గుముఖం పడుతుందని ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా కరీంనగర్ ఫిలిం భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను ‘జీరో’కు తీసుకురావడమే ధ్యేయమన్నారు. వ్యాధిగ్రస్తులు ధైర్యంగా మందులు వాడాలని సూచించారు. అనంతరం ఐసీటీసీ కౌన్సిలర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
Similar News
News February 18, 2026
కరీంనగర్: ‘విష’ ప్రయోగం.. 50 కోళ్లు మృత్యువాత!

కరీంనగర్ జిల్లా ఊటూర్లో మానవత్వం మంటగలిసింది. గుర్తుతెలియని వ్యక్తులు కోళ్ల దాణాలో విషం కలపడంతో 50 నాటుకోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. స్వయం ఉపాధి కోసం వీటిని పెంచుతున్న నిరుద్యోగి జలంధర్ రెడ్డికి సుమారు ₹70వేల నష్టం వాటిల్లింది. పశువైద్యులు విషప్రయోగాన్ని ధృవీకరించగా, బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. నోరులేని జీవాలను పొట్టనబెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
News February 18, 2026
కరీంనగర్: సర్వేయర్లకు లైసెన్సులు అందజేసిన కలెక్టర్

భూభారతి చట్టం-2025లో భాగంగా శిక్షణ పొందిన సర్వేయర్లకు కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం లైసెన్సులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి ఎంపికైన 274 మందిలో ఇప్పటికే 136 మందికి సీఎం చేతుల మీదుగా పత్రాలు అందగా, మిగిలిన వారిలో 41 మందికి నేడు కలెక్టర్ లైసెన్సులు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 5000 మందికి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఈ నియామక పత్రాలను అందజేస్తోంది.
News February 18, 2026
కరీంనగర్: సర్వేయర్లకు లైసెన్సులు అందజేసిన కలెక్టర్

భూభారతి చట్టం-2025లో భాగంగా శిక్షణ పొందిన సర్వేయర్లకు కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం లైసెన్సులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి ఎంపికైన 274 మందిలో ఇప్పటికే 136 మందికి సీఎం చేతుల మీదుగా పత్రాలు అందగా, మిగిలిన వారిలో 41 మందికి నేడు కలెక్టర్ లైసెన్సులు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 5000 మందికి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఈ నియామక పత్రాలను అందజేస్తోంది.


