News July 19, 2024
ఫైనల్స్లో కోహ్లీ, పాండ్య చాలా సపోర్ట్ చేశారు: అక్షర్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తనకి విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య ఎంతో సపోర్ట్ ఇచ్చారని టీమ్ఇండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గుర్తుచేసుకున్నారు. ‘ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. కేవలం బంతిని చూసి బాదేసేయ్’ అని గ్రౌండ్లోకి వెళ్తుండగా హార్దిక్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ‘ఏం పర్లేదు నేనున్నా. నువ్వు ఆడగలవు అనుకుంటే కొట్టేసేయ్’అని క్రీజులో ఉన్నపుడు కోహ్లీ తనలో ధైర్యం నింపినట్లు చెప్పారు. అక్షర్ 47 రన్స్ చేశారు.
Similar News
News December 16, 2025
వచ్చే నెలలో భోగాపురంలో ట్రయల్ రన్: రామ్మోహన్ నాయుడు

AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును వచ్చే ఏడాది మే నాటికి ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, విమానాశ్రయాన్ని అందంగా సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో GMR-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ఒప్పంద కార్యక్రమంలో లోకేశ్, రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రతి ఏటా ఏవియేషన్ రంగం 12% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని వివరించారు.
News December 16, 2025
నువ్వుల పంటలో కలుపు నివారణ, అంతరకృషి

నువ్వుల పంట విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 30%ఇ.సి. 700mlను కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉంటే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. అలాగే దీని పిచికారీ తర్వాత నీటి తడి పెట్టకూడదు. విత్తిన 15-20 రోజుల లోపు అదనపు మొక్కలను, 25-30 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి.
News December 16, 2025
భారత్లోనూ 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలా?

భారత్లో 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 60% పిల్లలు ప్రతిరోజూ దాదాపు 3 గంటలు వివిధ SM ప్లాట్ఫామ్లు, గేమింగ్ సైట్లలో గడుపుతున్నట్టు స్టడీలు వెల్లడిస్తున్నాయి. అది వ్యసనంగా మారి మానసిక ఆరోగ్య సమస్యలు, సైబర్ దాడుల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. <<18520645>>ఆస్ట్రేలియా<<>>లో చేసినట్టే భారత్లోనూ నిషేధించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.


