News November 5, 2025

KPHB: OYOలో పోలీసుల RAIDS

image

KPHBకాలనీలోని హోటళ్లలో అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తాజాగా రోడ్ నం.3లోని OYO హోటల్‌లో రైడ్స్ చేశారు. ఈ సోదాల్లో 6 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు కాకినాడకు చెందిన జ్యోతి, అజయ్ (27), రమేశ్ (28)గా గుర్తించారు. APలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. OYOలో రూమ్‌ అద్దెకు తీసుకొని మరీ వ్యాపారం మొదలుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

Similar News

News January 12, 2026

వరంగల్: BRSలోకి తక్కలపల్లి రవీందర్ రావు

image

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు ఈరోజు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా చేరారు. అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావును కలిశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించి, కాంగ్రెస్ అవినీతికి చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.

News January 12, 2026

భూపాలపల్లి: ‘ధాన్యం ట్యాబ్ ఎంట్రీల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు’

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో నమోదు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో పౌర సరఫరాలు, సహకార శాఖ, డీఆర్‌డీఏ అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. ఎంట్రీల ఆలస్యం వల్ల రైతులకు చెల్లింపులు ఆలస్యమవుతాయని, రోజువారీగా డేటా నమోదు చేయాలన్నారు.

News January 12, 2026

పాసు పుస్తకాలు పంపిణీకి ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో సోమవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ పై అధికారులతో కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్షించారు. రెండవ విడత పట్టాదారు పాసుపుస్తకాలు ఫిబ్రవరి రెండవ వారంలో జరిగే పంపిణీకి సిద్ధం చెయ్యాలని, 13 మండలాలకు సంబంధించి 14 గ్రామాలకు రీ సర్వే పూర్తి చేసి సిద్ధం చెయ్యాలన్నారు. 170 గ్రామాలకు 66,126 పట్టాదారు పాసుపుస్తకాలు రాగా, 62,483 పంపిణీ జరిగాయన్నారు.