News March 4, 2025

ఆదోనికి పోసాని కృష్ణమురళి

image

AP: గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని ఆదోని PSకు తరలిస్తున్నారు. అక్కడ ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో పీటీ వారెంట్ దాఖలు చేసి తీసుకెళ్తున్నారు. మరోవైపు, నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ వేయగా దానిపై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. రాజంపేట జైలులో ఉన్న ఆయన్ను నిన్న పోలీసులు పీటీ వారంట్‌పై నరసరావుపేట తీసుకురాగా, జడ్జి 10 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

Similar News

News December 15, 2025

తీవ్ర పొగమంచు.. మోదీ టూర్‌పై ఎఫెక్ట్

image

తీవ్ర పొగమంచు ప్రభావం ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై పడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టును పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ఆయన ప్రయాణం ఆలస్యమైంది. ఇవాళ ఉదయం 8.30 గంటలకే ఆయన బయల్దేరాల్సి ఉంది. ఈ నెల 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. కాగా ఉత్తర భారతంలో పొగమంచు వల్ల పలు రోడ్డు <<18561671>>ప్రమాదాలు<<>> చోటుచేసుకుంటున్నాయి. విమాన సర్వీసులపైనా తీవ్ర ప్రభావం పడింది.

News December 15, 2025

బంధాలకు భయపడుతున్నారా?

image

గామోఫోబియా అనేది రిలేషన్‌షిప్‌కు సంబంధించిన భయం. ఏదైనా బంధంలోకి వెళ్లడానికి, కమిట్‌మెంట్‌కు వీరు భయపడతారు. ఇదొక మానసిక సమస్య. ఈ ఫోబియా ఉన్నవాళ్లు ఒంటరిగా బతకడానికే ఇష్టపడతారు. దీన్నుంచి బయటపడటానికి మానసిక వైద్యుడిని సంప్రదించాలి. కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. కుటుంబసభ్యులతో గడపాలి. పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను తెలుసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడి సరైన బంధంలోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి.

News December 15, 2025

కోటి సంతకాల పత్రాలతో నేడు వైసీపీ ర్యాలీలు

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైసీపీ తెలిపింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టనుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను పార్టీ శ్రేణులు ర్యాలీలో ప్రదర్శించనున్నాయి. వాటిని ఈ నెల 18న గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వైసీపీ అధినేత జగన్ అందజేయనున్నారు. కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దని కోరనున్నారు.