News August 12, 2025
KU డిగ్రీ RESULTS వచ్చేశాయ్!

మే నెలలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ రెగ్యులర్ 1, 2, 3, 4 సెమిస్టర్ పరీక్షలతో పాటు, దూర విద్య డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. వర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చన్నారు. మొదటి సెమిస్టర్లో 31%, 2లో 30, 3లో 35, 4లో 39, దూరవిద్య మొదటి సెమిస్టర్లో 24% మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యుయేషన్ కోసం ఈనెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 12, 2026
భద్రాచలం. ‘శ్రీరామనవమి వేడుకలు.. బస్సులు కొరత ఉండొద్దు’

భద్రాచలం ఐటీడీఏ గిరిజన భవన్లో శ్రీరామనవమి వేడుకలపై TSRTC సమీక్ష సమావేశం జరిగింది. కరీంనగర్ డిపో మేనేజర్ సాల్మన్ ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడుతూ.. ఈ నెల 27, 28న స్వామివారి కళ్యాణానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో బస్సులు నడపాలని సూచించారు. సమావేశంలో భద్రాచలం డిపోతో పాటు ఆరు డిపోల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.
News March 12, 2026
ముత్యాలమ్మ జాతరలో డ్రోన్లతో నిఘా

తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిరంతరం డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. కమాండ్ కంట్రోల్ సీసీ టీవీ ఫుటేజ్తో పాటు డ్రోన్ల పర్యవేక్షణ కొనసాగించారు. జాతరలో అసాంఘిక కార్యక్రమాలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వంటివి జరగకుండా అరికట్టారు.
News March 12, 2026
శ్రీకాకుళం: లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి

జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం తెలిపారు. ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి జిల్లాలో 11,602 కేసులు గుర్తించడమైనదని, జిల్లా మొత్తం మీద 20 బెంచ్లు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలో 4 బెంచ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.


