News September 11, 2025

KU పీజీ ఫలితాలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ వివిధ పీజీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎంఏ(పొలిటికల్ సైన్స్‌) 4వ సెమిస్టర్‌ మే, ఎంఏ(ఎంసీజే) మొదటి సెమిస్టర్‌ ఏప్రిల్‌, ఎంఎస్సీ(ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ) 6వ సెమిస్టర్‌ జూన్‌, ఎంఏ(ఇంగ్లిష్‌) మొదటి సెమిస్టర్‌ మార్చి-2025 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాల కోసం www.kuexams.org యూనివర్సిటీ వెబ్‌సైట్‌‌ను విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News December 12, 2025

రాజమండ్రి: పెట్రోల్ దొంగతనం చేస్తున్నాడని హత్య.. జైలు

image

కడియానికి చెందిన రాయ వెంకన్న, నల్లి శేఖర్‌లకు 7 సం.లు జైలు శిక్ష, రూ. 5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2018 సెప్టెంబర్లో కడియం (M) M. R పాలేనికి చెందిన శీలం సంతోశ్ (13) మోటారు సైకిళ్లలో పెట్రోల్ చోరీ చేస్తున్నాడనే నెపంతో వెంకన్న, శేఖర్ కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదయింది. దీనిపై జిల్లా జడ్జి గంధం సునీత శిక్ష ఖరారు చేశారు.

News December 12, 2025

SKLM: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

image

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి గురువారం ప్రకటనలో తెలిపారు.ఇంధన పొదుపు ఆవశ్యకతను వినియోగదారులకు మరింత తెలిసేలా అవగాహన కల్పించేలా నిర్వహిస్తామన్నారు. ఈ వారోత్సవాలను శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ కేంద్రాల్లో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News December 12, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ ఎంట్రీ

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీలను బీజేపీ కైవసం చేసుకొని సత్తాచాటింది. జిల్లాలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి సీన్ మారింది. గ్రామాల్లో సైతం కమలం పార్టీ పుంజుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 22 గ్రామ పంచాయతీలను బీజేపీ సొంతం చేసుకుంది. వరంగల్ జిల్లాలో 3, హనుమకొండలో 10, జనగామలో 1, మహబూబాబాద్‌లో 5, భూపాలపల్లిలో 3, ములుగులో మాత్రం ఖాతా తెరవలేదు.