News March 24, 2024
డీఎస్సీ నిర్వహణపై రాని క్లారిటీ

AP: 6,100 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలపై ఇంకా క్లారిటీ రాలేదు. మార్చి 30 నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనే దానిపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పరీక్షల నిర్వహణపై ఈసీ అనుమతి కోసం ఎదురుచూస్తున్న విద్యాశాఖ.. పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్టికెట్ల డౌన్లోడ్, టెట్ ఫలితాల వెల్లడిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Similar News
News December 11, 2025
5 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు

SIR గడువు వారం రోజులు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత CEOల వినతులతో గడువు పొడిగించినట్టు తెలిపింది. యూపీ, ఛత్తీస్గఢ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్లో మరో వారంపాటు SIR కొనసాగనుంది. కాగా గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్లో ఈరోజుతో SIR ముగియగా DEC 16న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ కానుంది.
News December 11, 2025
విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంటు

AP: యోనెక్స్- సన్రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2025 టోర్నమెంటు ఈనెల 24-28 తేదీల్లో విజయవాడలో జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను CM CBN ఆవిష్కరించారు. ఏపీలో పదేళ్ల తర్వాత ఈ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈ టోర్నమెంటును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని సీఎం వారికి సూచించారు.
News December 11, 2025
అందుకే నరసింహ రైట్స్ అమ్మలేదు: రజినీకాంత్

రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘నరసింహ’ మూవీని రేపు రీరిలీజ్ చేస్తున్నారు. ‘సినీ కెరీర్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్లు. నరసింహ రిలీజై 25 ఏళ్లు పూర్తయ్యాయి. థియేటర్లలో ఈ సినిమా చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలి. అందుకే డిజిటల్ రైట్స్ ఇవ్వలేదు’ అని సినిమా హీరో, ప్రొడ్యూసర్, రచయిత రజినీకాంత్ చెప్పారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్లో క్యారెక్టర్ స్ఫూర్తితో నీలాంబరి పాత్ర రాసినట్టు తెలిపారు.


